సినిమా రిలీజయ్యే వరకు కథ గురించి క్లారిటీ ఇవ్వకుండా నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని చూసే దర్శకులు కొందరైతే.. మరికొందరు మాత్రం కథేంటో ముందే క్లియర్గా చెప్పేసి, ప్రేక్షకులు తామేం చూడబోతున్నామో ప్రిపేర్ చేసి థియేటర్లకు తీసుకొచ్చేవారు ఇంకొందరు. దర్శక ధీరుడు రాజమౌళి రెండో కోవకే చెందుతాడు. చాలా వరకు ఆయన సినిమాల్లో కథేంటో ముందే తెలిసిపోతుంటుంది.
‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ సహా కొన్ని చిత్రాల కథేంటో రాజమౌళి ప్రెస్ మీట్లలోనే స్వయంగా వెల్లడించడం గుర్తుండే ఉంటుంది. మిగతా సినిమాల కథను ట్రైలర్ల రూపంలో తెలియజేశాడు. ఇప్పుడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రేక్షకులు ‘కల్కి’లో చూడబోయేదేంటో ముందే చెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పటిదాకా రిలీజైన ‘కల్కి’ ప్రోమోలు చూస్తే కథ విషయంలో ప్రేక్షకులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఇదే కన్ఫ్యూజన్తో థియేటర్లలో అడుగు పెడితే కష్టమనుకున్నాడో ఏమో.. రిలీజ్ ముంగిట ఈ సినిమా కాన్సెప్ట్ సహా కొన్ని ముఖ్య విషయాలను విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నాగి. ప్రెల్యూడ్లో చెప్పిందే కాక.. ముంబయిలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ కథ గురించి వివరణ ఇచ్చాడు నాగి. అతను చెప్పిన ప్రకారం.. కల్కి కథ మూడు ప్రపంచాల మధ్య నడుస్తుంది. అందులో ఒకటి కాశి. ప్రపంచంలో ఏర్పడిన తొలి నగరంగా పేరున్న కాశి.. చివరి నగరంగా మారే పరిస్థితి ఆలోచనతోనే ఈ కథ మొదలవుతుంది.
అక్కడి ప్రజలు దుర్భర జీవనం అనుభవిస్తుంటారు. అదే సమయంలో పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ల మేర ఉండే ఆ ప్రాంతంలో సకల సౌకర్యాలుంటాయి. కాశీ ప్రజలు కాంప్లెక్స్కు వెళ్లి అక్కడున్నవాటిని ఆస్వాదించాలనుకుంటారు. కానీ అక్కడికి వెళ్లడానికి మిలియన్ల కొద్దీ యూనిట్స్ ఉండాలి. జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు శంబాలా అనే మరో రహస్య ప్రపంచం కూడా ఉంటుంది. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ ఉంటుంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతూ.. ఆ సంఘర్షణలో నడిచే కథే ‘కల్కి’ అట.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…