కల్కి సినిమా విషయంలో ముందు నుంచి ఎందుకో కొంత నిరాసక్తతతో కనిపించింది హీరోయిన్ దీపికా పదుకొనే. కల్కి అనౌన్స్మెంట్ టైంలో దీన్ని ప్రభాస్ సినిమాగా పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మొదలుపెడితే.. సినిమా విడుదల దగ్గర పడుతున్నా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం, సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయకపోవడంతో అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది దీపికా.
ఐతే ఇంకో ఎనిమిది రోజుల్లో కల్కి విడుదల కాబోతుండగా.. ముంబయిలో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో దీపికా పాల్గొనడమే కాక సినిమా గురించి సానుకూలంగా మాట్లాడుతూ, ప్రభాస్ అండ్ కోతో కలుపుగోలుగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వేడుకకు దీపికా బేబీ బంప్తో హాజరైంది.
రణ్వీర్ సింగ్, దీపికా దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం ఇటీవలే వెల్లడైంది. ఆ తర్వాత దీపికా బేబీ బంప్తో మీడియా ముందు హాజరు కావడం ఇదే తొలిసారి. ప్రి రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద దీపికకు టీం మంచి ఎలివేషన్ ఇచ్చింది.
ఆమె కోసం స్పెషల్ ఏవీ కూడా రెడీ చేయించింది. ఆ వీడియో అయ్యాక దీపిక బేబీ బంప్తో కనిపించి చిన్న స్పీచ్ ఇచ్చింది. ప్రసంగం అయ్యాక దీపిక కిందికి దిగుతుండగా.. ప్రభాస్ ఎదురెళ్లి ఆమెకు చేయి ఇచ్చి కిందికి తీసుకురావడం విశేషం. ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ కోసం ప్రభాస్ ఇలా చొరవ చూపించడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్కు కౌంటర్ కూడా ఇచ్చారు. హీరోయిన్ కోసమైతే ఇంత సాయం చేస్తావా అన్నట్లు ప్రభాస్ను ఆటపట్టించే ప్రయత్నం చేశారు అమితాబ్. మొత్తానికి కల్కి సినిమాకు సంబంధించి ఇన్ని రోజులు అంటి ముట్టనట్లు ఉన్న దీపికా.. రిలీజ్ టైంకి ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…