ప్రస్తుతం టాలీవుడ్ నట వర్గమంతా వారసులతోనే నిండిపోయింది. ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో అన్ని విభాగాల నుంచి నటులు వచ్చి ఇండస్ట్రీని నింపేశారు. దర్శకుల కొడుకుల్లోనూ చాలామంది హీరోలే అయ్యారు. ఐతే ఇప్పుడు ఒక దర్శకుడి కొడుకు మాత్రం నటన వైపు వెళ్లకుండా తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. అతనే.. రిషి.
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ ఇద్దరు కొడుకుల్లో ఒకడైన రిషి.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అలా అని అతనేమీ తండ్రి దగ్గర అసిస్టెంట్గా పని చేయడం లేదు. తండ్రి భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న వేరే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా కుదురుకోవడం విశేషం.
‘సితార ఎంటర్టైన్మెంట్స్’తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ‘ఫార్చ్యూన్ ఫోర్’ వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బేనర్ల భాగస్వామ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రిషి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడట. రిషి ఎలా ఉంటాడో మొన్నటిదాకా జనాలకు తెలియదు.
ఐతే తాజాగా త్రివిక్రమ్ తన కుటుంబంతో కలిసి కాలి నడకన తిరుమలకు వెళ్లాడు. ఆ సందర్భంగా ఆయన ఇద్దరు కొడుకులు మీడియా కళ్లలో పడ్డారు. రిషి మంచి లుక్స్తో హీరోలా కనిపించడంతో అతను నటుడిగా అరంగేట్రం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రిషి మాత్రం తండ్రి బాటలో దర్శకుడు కావాలని ఆశ పడుతున్నాడు. అతను తండ్రి పేరును నిలబెట్టే స్థాయికి ఎదుగుతాడని ఆశిద్దాం.
This post was last modified on June 19, 2024 3:18 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…