Movie News

త్రివిక్రమ్ వారసుడి అరంగేట్రం

ప్రస్తుతం టాలీవుడ్ నట వర్గమంతా వారసులతోనే నిండిపోయింది. ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో అన్ని విభాగాల నుంచి నటులు వచ్చి ఇండస్ట్రీని నింపేశారు. దర్శకుల కొడుకుల్లోనూ చాలామంది హీరోలే అయ్యారు. ఐతే ఇప్పుడు ఒక దర్శకుడి కొడుకు మాత్రం నటన వైపు వెళ్లకుండా తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. అతనే.. రిషి.

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ ఇద్దరు కొడుకుల్లో ఒకడైన రిషి.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అలా అని అతనేమీ తండ్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేయడం లేదు. తండ్రి భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న వేరే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కుదురుకోవడం విశేషం.

‘సితార ఎంటర్టైన్మెంట్స్‌’తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ‘ఫార్చ్యూన్ ఫోర్’ వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బేనర్ల భాగస్వామ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రిషి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. రిషి ఎలా ఉంటాడో మొన్నటిదాకా జనాలకు తెలియదు.

ఐతే తాజాగా త్రివిక్రమ్ తన కుటుంబంతో కలిసి కాలి నడకన తిరుమలకు వెళ్లాడు. ఆ సందర్భంగా ఆయన ఇద్దరు కొడుకులు మీడియా కళ్లలో పడ్డారు. రిషి మంచి లుక్స్‌తో హీరోలా కనిపించడంతో అతను నటుడిగా అరంగేట్రం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రిషి మాత్రం తండ్రి బాటలో దర్శకుడు కావాలని ఆశ పడుతున్నాడు. అతను తండ్రి పేరును నిలబెట్టే స్థాయికి ఎదుగుతాడని ఆశిద్దాం.

This post was last modified on June 19, 2024 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

50 minutes ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

5 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

9 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

10 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

11 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

11 hours ago