Movie News

ఇంట్రెస్టింగ్.. ప్రభాస్ సినిమాకు మెంటార్‌గా ఆ లెజెండ్

ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్న ప్రభాస్.. దీని తర్వాత రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమాను లేటుగా అనౌన్స్ చేసినప్పటికీ.. ముందు మొదలయ్యేది అదే అనిపిస్తోంది. ఆ చిత్రమే.. ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

ఇక ‘మహానటి’తో గొప్ప పేరు సంపాదించిన మన తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఓ భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మించబోయే ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కబోయేదే. ఇది ఫాంటసీ మిక్స్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం మరింత ఊపందుకునేలా ఈ ప్రాజెక్టులోకి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును తీసుకురావడం విశేషం.

సోమవారం సింగీతం 89వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ సినిమాలో ఆయన భాగమవుతున్నట్లుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్ర బృందం ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది. తమ చిత్రానికి సింగీతం మెంటార్‌గా పని చేయబోతున్నట్లు వెల్లడించింది. దక్షిణాదిన సింగీతం చేసినన్ని ప్రయోగాలు మరే దర్శకుడూ చేసి ఉండడంటే ఆశ్చర్యం లేదు. అందరూ ఒక మూసలో కొట్టుకుపోతున్న సమయంలో పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి వినూత్న చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారాయన.

ఇప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయే సినిమా ‘ఆదిత్య 369’ లైన్లో ఉంటుందన్న ఊహాగానాలు వినిపించగా.. సింగీతంను దీనికి మెంటార్‌గా తీసుకోవడంతో అది నిజమే అనిపిస్తోంది. సింగీతం ఈ ప్రాజెక్టులోకి వచ్చి ఏం సలహాలిస్తాడన్నది పక్కన పెడితే.. ఆ దిగ్గజాన్ని వైజయంతీ మూవీస్ వాళ్లు గౌరవిస్తున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇదిలా ఉండగా.. సింగీతం ఈ నెల 9న కరోనా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ కోలుకుంటున్నారు.

This post was last modified on September 21, 2020 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

46 seconds ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

30 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

5 hours ago