జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవు. మెగాస్టార్ చిరంజీవి సహా మెగా ఫ్యామిలీకి చెందిన అనేక మంది విజయవాడకు చేరుకుని ఈ వేడుకలో పాల్గొన్నారు.
కానీ అక్కడ అల్లు అర్జున్ కానీ, అల్లు కుటుంబం నుంచి ఇంకెవ్వరు కానీ కనిపించలేదు. కొన్నేళ్ల నుంచి మెగా ఫ్యామిలీ నుంచి కాస్త వేరు పడ్డట్లుగా కనిపిస్తున్న అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యాన్స్లో ఒక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఒక ట్వీట్ మాత్రం వేసి.. వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవి కోసం నంద్యాలకు వెళ్లి మరీ ప్రచారం చేయడం వివాదాస్పదం అయింది. అప్పట్నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బన్నీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఆ ఒరవడి కొనసాగుతూనే ఉంది.
ఇంతలో చిరు, పవన్ల మేనల్లుడు.. హీరో కూడా అయిన సాయిధరమ్ తేజ్.. బన్నీని సామాజిక మాధ్యమాల్లో అన్ఫాలో చేశాడన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ట్విట్టర్తో పాటు ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ను తేజు అన్ఫాలో చేశాడట.
మరి తేజు.. ఎప్పట్నుంచి బన్నీని ఫాలో అవుతున్నాడు.. ఇప్పుడు సడెన్గా పవన్ ప్రమాణ స్వీకారం రోజే అతణ్ని ఎందుకు అన్ఫాలో చేశాడు అన్నది తెలియాల్సి ఉంది. బన్నీ సతీమణి స్నేహా రెడ్డిని సైతం తేజు అన్ఫాలో చేశాడట. బన్నీతో తేజు ఎప్పుడూ అంత సన్నిహితంగా మెలిగింది లేదు.
గతంలో పవన్ అభిమానులను ఉద్దేశించి బన్నీ చెప్పను బ్రదర్ అనే వివాదాస్పద కామెంట్ చేసినపుడు.. దానికి తర్వాత ఓ సందర్భంలో చెబుతాను బ్రదర్ అంటూ కౌంటర్ ఇచ్చాడు తేజు. పవన్ మీద తేజు అభిమానం ఎలాంటిదో తెలిసిందే కాబట్టి అతనిలా చేయడం మెగా అభిమానులకు ఆశ్చర్యం కలిగించడం లేదు.
This post was last modified on June 13, 2024 1:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…