రేపు విడుదల కాబోతున్న సినిమాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. పెద్ద స్టార్ హీరోలవి కాకపోయినా మీడియం, చిన్న బడ్జెట్ చిత్రాల కాంపిటేషన్ కావడంతో ఓపెనింగ్స్ రాబట్టుకోవడం పెద్ద సవాల్ గా మారింది. అందుకే ప్రమోషన్ల విషయంలో నటీనటులు యథాశక్తి తమకు చేతనైనంత పబ్లిసిటీలో భాగమవుతున్నారు. వాటిలో మ్యూజిక్ షాప్ మూర్తి ఒకటి.
అజయ్ ఘోష్ టైటిల్ పాత్ర పోషించగా చాందిని చౌదరి ఒక కీలక పాత్రలో నటించింది. పాత ఆడియో షాపు నడుపుకునే ఒక మధ్యతరగతి మాములు మనిషి జీవితాన్ని ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అన్ని అంశాలు దట్టించినట్టే కనిపిస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ తమ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఒకవేళ బాలేదనిపిస్తే తన నెంబర్ 92******66 కి ఫోన్ చేసి బూతులు తిట్టమని పబ్లిక్ స్టేజి మీద ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కంటెంట్ మీద నమ్మకం ఉండటం మంచిదే.
అలా అని ఏకంగా పర్సనల్ సెల్ కాంటాక్ట్ ఇస్తే చాలా సమస్యలు వస్తాయి. అసలే ఇది సోషల్ మీడియా కాలం. మంచి ఉద్దేశం కోసం వాడేవాళ్ళతో పాటు పనీపాటా లేని బ్యాచ్ కూడా ఇందులోనే ఉంటారు. మ్యూజిక్ షాప్ మూర్తి గురించి చెప్పకుండా అవవసరమైన మాటలను పొడిగించే వాళ్లకు కొదవే ఉండదు. కంట్రోల్ చేయడం జరగని పని.
ఇంతగా ఆయన ఓపెనవ్వడానికి కారణం లేకపోలేదు. కేవలం అజయ్ ఘోష్ పేరు మీదే టికెట్లు తెగడం కష్టం. నిజంగానే సినిమా బాగుండొచ్చు. కానీ ఇమేజ్ ఉన్న హీరోల కోసమే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటిది మ్యూజిక్ షాప్ మూర్తి కోసం పబ్లిక్ రావాలంటే ఏదో అద్భుతం జరగాలి.
అది ఉందనే నమ్మకాన్ని కలిగించేందుకే ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు కానీ దానివల్ల వచ్చే తలనెప్పి ఎలా ఉంటుందో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ఒక్క పిలుపుతో అజయ్ ఘోష్ వీడియో, సినిమా రెండు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి.
This post was last modified on June 13, 2024 11:34 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…