బిగ్బాస్ షోలో తేజస్వి, బాబు గోగినేని లాంటి వాళ్లకు విపరీతమైన బ్యాడ్నేమ్ రావడంతో గత సీజన్లో చాలా మంది సేఫ్ గేమ్ ఆడారు. ఈ సీజన్లో కూడా ప్లేయర్స్ అంతా సేఫ్ ఆడేస్తున్నారు. ఎంత సేఫ్ అంటే… కనీసం నామినేషన్స్ అయినా తప్పించుకోవడానికి చూడట్లేదు. కెప్టెన్ పదవి కోసం కూడా పోటీ పడడం లేదు. వాళ్లంతా అలా సేఫ్ గేమ్ ఆడితే బిగ్బాస్ షో ఆసక్తికరంగా మారడం కష్టం.
అందుకే ఈ వీకెండ్లో ఆ సేఫ్ గేమ్కి నాగార్జునతో క్లాస్ ఇప్పించడమే కాకుండా తమ వంతుగా నాలుగైదు పుల్లలు పెట్టేసి హౌస్లో ప్లేయర్స్ గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యారు బిగ్బాస్ షో నిర్వాహకులు. ఎవరు హీరో, ఎవరు జీరో అనే టాస్క్ వల్ల అమ్మ రాజశేఖర్, లాస్య రెండు టీమ్స్ అయిపోయాయి.
ఇన్నిరోజులు అక్కా, చెల్లీ అనుకున్న లాస్య, దివి మధ్య అగ్గి రాజుకుంది. ఇక దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేసే ప్రాసెస్లో మరింత మంది మధ్య పుల్లలు పెట్టేసారు. మెహబూబ్ అంటేనే హారిక రగిలిపోతోందిపుడు. ఇక టీవీ 9 దేవి కూడా అమ్మ రాజశేఖర్ ఈగోని హర్ట్ చేసింది. తాను సింపతీ గేమ్ ఆడడమే కాకుండా మిగతా వాళ్లతో కూడా సేఫ్ గేమ్ ఆడిస్తోన్న నోయెల్కి డోస్ గట్టిగానే పడింది.
ఇక ఇప్పుడు నామినేషన్ టాస్కులయినా, ఫిజికల్ టాస్కులయినా రసవత్తరంగా మారతాయి. ఐపీఎల్ మొదలైపోయిన దశలో తమ ఆడియన్స్ ని మిస్ చేసుకోకూడదంటే ఈమాత్రం ఘాటుండాలని బిగ్బాస్ మేనేజ్మెంట్ గుర్తించింది. ఈసారి పబ్లిక్ ఒపీనియన్ కన్సిడర్ చేస్తూ గత సీజన్లలో మాదిరిగా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి కొమ్ము కాసే పద్ధతిని కూడా విడిచి పెట్టేసింది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…