బిగ్బాస్ షోలో తేజస్వి, బాబు గోగినేని లాంటి వాళ్లకు విపరీతమైన బ్యాడ్నేమ్ రావడంతో గత సీజన్లో చాలా మంది సేఫ్ గేమ్ ఆడారు. ఈ సీజన్లో కూడా ప్లేయర్స్ అంతా సేఫ్ ఆడేస్తున్నారు. ఎంత సేఫ్ అంటే… కనీసం నామినేషన్స్ అయినా తప్పించుకోవడానికి చూడట్లేదు. కెప్టెన్ పదవి కోసం కూడా పోటీ పడడం లేదు. వాళ్లంతా అలా సేఫ్ గేమ్ ఆడితే బిగ్బాస్ షో ఆసక్తికరంగా మారడం కష్టం.
అందుకే ఈ వీకెండ్లో ఆ సేఫ్ గేమ్కి నాగార్జునతో క్లాస్ ఇప్పించడమే కాకుండా తమ వంతుగా నాలుగైదు పుల్లలు పెట్టేసి హౌస్లో ప్లేయర్స్ గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యారు బిగ్బాస్ షో నిర్వాహకులు. ఎవరు హీరో, ఎవరు జీరో అనే టాస్క్ వల్ల అమ్మ రాజశేఖర్, లాస్య రెండు టీమ్స్ అయిపోయాయి.
ఇన్నిరోజులు అక్కా, చెల్లీ అనుకున్న లాస్య, దివి మధ్య అగ్గి రాజుకుంది. ఇక దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేసే ప్రాసెస్లో మరింత మంది మధ్య పుల్లలు పెట్టేసారు. మెహబూబ్ అంటేనే హారిక రగిలిపోతోందిపుడు. ఇక టీవీ 9 దేవి కూడా అమ్మ రాజశేఖర్ ఈగోని హర్ట్ చేసింది. తాను సింపతీ గేమ్ ఆడడమే కాకుండా మిగతా వాళ్లతో కూడా సేఫ్ గేమ్ ఆడిస్తోన్న నోయెల్కి డోస్ గట్టిగానే పడింది.
ఇక ఇప్పుడు నామినేషన్ టాస్కులయినా, ఫిజికల్ టాస్కులయినా రసవత్తరంగా మారతాయి. ఐపీఎల్ మొదలైపోయిన దశలో తమ ఆడియన్స్ ని మిస్ చేసుకోకూడదంటే ఈమాత్రం ఘాటుండాలని బిగ్బాస్ మేనేజ్మెంట్ గుర్తించింది. ఈసారి పబ్లిక్ ఒపీనియన్ కన్సిడర్ చేస్తూ గత సీజన్లలో మాదిరిగా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి కొమ్ము కాసే పద్ధతిని కూడా విడిచి పెట్టేసింది.
This post was last modified on September 21, 2020 11:17 am
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…