Movie News

గేమ్‍ మొత్తం తిప్పేసిన బిగ్‍బాస్‍

బిగ్‍బాస్‍ షోలో తేజస్వి, బాబు గోగినేని లాంటి వాళ్లకు విపరీతమైన బ్యాడ్‍నేమ్‍ రావడంతో గత సీజన్‍లో చాలా మంది సేఫ్‍ గేమ్‍ ఆడారు. ఈ సీజన్లో కూడా ప్లేయర్స్ అంతా సేఫ్‍ ఆడేస్తున్నారు. ఎంత సేఫ్‍ అంటే… కనీసం నామినేషన్స్ అయినా తప్పించుకోవడానికి చూడట్లేదు. కెప్టెన్‍ పదవి కోసం కూడా పోటీ పడడం లేదు. వాళ్లంతా అలా సేఫ్‍ గేమ్‍ ఆడితే బిగ్‍బాస్‍ షో ఆసక్తికరంగా మారడం కష్టం.

అందుకే ఈ వీకెండ్‍లో ఆ సేఫ్‍ గేమ్‍కి నాగార్జునతో క్లాస్‍ ఇప్పించడమే కాకుండా తమ వంతుగా నాలుగైదు పుల్లలు పెట్టేసి హౌస్‍లో ప్లేయర్స్ గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యారు బిగ్‍బాస్‍ షో నిర్వాహకులు. ఎవరు హీరో, ఎవరు జీరో అనే టాస్క్ వల్ల అమ్మ రాజశేఖర్‍, లాస్య రెండు టీమ్స్ అయిపోయాయి.

ఇన్నిరోజులు అక్కా, చెల్లీ అనుకున్న లాస్య, దివి మధ్య అగ్గి రాజుకుంది. ఇక దేత్తడి హారికను ఫేక్‍ ఎలిమినేషన్‍ చేసే ప్రాసెస్‍లో మరింత మంది మధ్య పుల్లలు పెట్టేసారు. మెహబూబ్‍ అంటేనే హారిక రగిలిపోతోందిపుడు. ఇక టీవీ 9 దేవి కూడా అమ్మ రాజశేఖర్‍ ఈగోని హర్ట్ చేసింది. తాను సింపతీ గేమ్‍ ఆడడమే కాకుండా మిగతా వాళ్లతో కూడా సేఫ్‍ గేమ్‍ ఆడిస్తోన్న నోయెల్‍కి డోస్‍ గట్టిగానే పడింది.

ఇక ఇప్పుడు నామినేషన్‍ టాస్కులయినా, ఫిజికల్‍ టాస్కులయినా రసవత్తరంగా మారతాయి. ఐపీఎల్‍ మొదలైపోయిన దశలో తమ ఆడియన్స్ ని మిస్‍ చేసుకోకూడదంటే ఈమాత్రం ఘాటుండాలని బిగ్‍బాస్‍ మేనేజ్‍మెంట్‍ గుర్తించింది. ఈసారి పబ్లిక్‍ ఒపీనియన్‍ కన్సిడర్‍ చేస్తూ గత సీజన్లలో మాదిరిగా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి కొమ్ము కాసే పద్ధతిని కూడా విడిచి పెట్టేసింది.

This post was last modified on September 21, 2020 11:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

31 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago