బిగ్బాస్ షోలో తేజస్వి, బాబు గోగినేని లాంటి వాళ్లకు విపరీతమైన బ్యాడ్నేమ్ రావడంతో గత సీజన్లో చాలా మంది సేఫ్ గేమ్ ఆడారు. ఈ సీజన్లో కూడా ప్లేయర్స్ అంతా సేఫ్ ఆడేస్తున్నారు. ఎంత సేఫ్ అంటే… కనీసం నామినేషన్స్ అయినా తప్పించుకోవడానికి చూడట్లేదు. కెప్టెన్ పదవి కోసం కూడా పోటీ పడడం లేదు. వాళ్లంతా అలా సేఫ్ గేమ్ ఆడితే బిగ్బాస్ షో ఆసక్తికరంగా మారడం కష్టం.
అందుకే ఈ వీకెండ్లో ఆ సేఫ్ గేమ్కి నాగార్జునతో క్లాస్ ఇప్పించడమే కాకుండా తమ వంతుగా నాలుగైదు పుల్లలు పెట్టేసి హౌస్లో ప్లేయర్స్ గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యారు బిగ్బాస్ షో నిర్వాహకులు. ఎవరు హీరో, ఎవరు జీరో అనే టాస్క్ వల్ల అమ్మ రాజశేఖర్, లాస్య రెండు టీమ్స్ అయిపోయాయి.
ఇన్నిరోజులు అక్కా, చెల్లీ అనుకున్న లాస్య, దివి మధ్య అగ్గి రాజుకుంది. ఇక దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేసే ప్రాసెస్లో మరింత మంది మధ్య పుల్లలు పెట్టేసారు. మెహబూబ్ అంటేనే హారిక రగిలిపోతోందిపుడు. ఇక టీవీ 9 దేవి కూడా అమ్మ రాజశేఖర్ ఈగోని హర్ట్ చేసింది. తాను సింపతీ గేమ్ ఆడడమే కాకుండా మిగతా వాళ్లతో కూడా సేఫ్ గేమ్ ఆడిస్తోన్న నోయెల్కి డోస్ గట్టిగానే పడింది.
ఇక ఇప్పుడు నామినేషన్ టాస్కులయినా, ఫిజికల్ టాస్కులయినా రసవత్తరంగా మారతాయి. ఐపీఎల్ మొదలైపోయిన దశలో తమ ఆడియన్స్ ని మిస్ చేసుకోకూడదంటే ఈమాత్రం ఘాటుండాలని బిగ్బాస్ మేనేజ్మెంట్ గుర్తించింది. ఈసారి పబ్లిక్ ఒపీనియన్ కన్సిడర్ చేస్తూ గత సీజన్లలో మాదిరిగా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి కొమ్ము కాసే పద్ధతిని కూడా విడిచి పెట్టేసింది.
This post was last modified on September 21, 2020 11:17 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…