రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమయ్యింది. ప్రధాని మోడీతో మొదలుకుని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మినిస్టర్లు దీనికి భారీ ఎత్తున హాజరు కాబోతున్నారు. మాములుగా ఇలాంటి కార్యక్రమంలో సినీ తారల సందడి తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి దక్కిన చారిత్రాత్మక విజయానికి సాక్ష్యంగా నిలవడం కోసం పెద్ద ఎత్తున స్టార్లు తరలివస్తున్నారు. ఆహ్వానాలు ఎవరికి వెళ్లాయనే పూర్తి సమాచారం ఇంకా రాకపోయినా ముఖ్యమైన లిస్టు అయితే కొంతవరకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటు సురేఖా, శ్రీజ, ఇద్దరు మనవరాళ్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. బాలకృష్ణ కుటుంబ సమేతంగా విచ్చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. చంద్రబాబుకి అత్యంత ఆప్త మిత్రుల్లో ఒకరైన ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వెళ్లిందని తొలుత ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి అందలేదని తారక్ టీమ్ అంటున్న మాట. అల్లు అర్జున్ రావొచ్చని మరో వార్త ఉంది. మహేష్ బాబు, ప్రభాస్ లకు పిలుపు వెళ్లిందన్నారు కానీ ఖరారుగా తెలియదు.
మొత్తానికి అరుదైన తారా తోరణానికి రేపటి సంరంభం వేదిక కానుంది. అసలే టాలీవుడ్ లో కూటమి వచ్చిన ఆనందం కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటిదాకా ఎదురైన ఇబ్బందికర పరిస్థితులకు చరమగీతం పాడేశారని సంతోషంగా ఉన్నారు. దీంతో ఫోన్ కాల్స్ ఇతరత్రా మార్గాల ద్వారా ఇన్విటేషన్ అందుకున్న ఇండస్ట్రీ పెద్దలు రేపు భారీ ఎత్తున తరలివచ్చిన ఆశ్చర్యం లేదు. ఎన్నో నెలల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై కలుసుకోవడం లాంటి అరుదైన జ్ఞాపకాలు రేపు చూడబోతున్నాం. పవన్ డిప్యూటీ సిఎంగా పదవి స్వీకరిస్తారనే న్యూస్ ఆల్రెడీ తిరుగుతోంది. రేపు మాములు సందడి ఉండేలా లేదు.
This post was last modified on June 11, 2024 9:56 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…