రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమయ్యింది. ప్రధాని మోడీతో మొదలుకుని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మినిస్టర్లు దీనికి భారీ ఎత్తున హాజరు కాబోతున్నారు. మాములుగా ఇలాంటి కార్యక్రమంలో సినీ తారల సందడి తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి దక్కిన చారిత్రాత్మక విజయానికి సాక్ష్యంగా నిలవడం కోసం పెద్ద ఎత్తున స్టార్లు తరలివస్తున్నారు. ఆహ్వానాలు ఎవరికి వెళ్లాయనే పూర్తి సమాచారం ఇంకా రాకపోయినా ముఖ్యమైన లిస్టు అయితే కొంతవరకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటు సురేఖా, శ్రీజ, ఇద్దరు మనవరాళ్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. బాలకృష్ణ కుటుంబ సమేతంగా విచ్చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. చంద్రబాబుకి అత్యంత ఆప్త మిత్రుల్లో ఒకరైన ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వెళ్లిందని తొలుత ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి అందలేదని తారక్ టీమ్ అంటున్న మాట. అల్లు అర్జున్ రావొచ్చని మరో వార్త ఉంది. మహేష్ బాబు, ప్రభాస్ లకు పిలుపు వెళ్లిందన్నారు కానీ ఖరారుగా తెలియదు.
మొత్తానికి అరుదైన తారా తోరణానికి రేపటి సంరంభం వేదిక కానుంది. అసలే టాలీవుడ్ లో కూటమి వచ్చిన ఆనందం కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటిదాకా ఎదురైన ఇబ్బందికర పరిస్థితులకు చరమగీతం పాడేశారని సంతోషంగా ఉన్నారు. దీంతో ఫోన్ కాల్స్ ఇతరత్రా మార్గాల ద్వారా ఇన్విటేషన్ అందుకున్న ఇండస్ట్రీ పెద్దలు రేపు భారీ ఎత్తున తరలివచ్చిన ఆశ్చర్యం లేదు. ఎన్నో నెలల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై కలుసుకోవడం లాంటి అరుదైన జ్ఞాపకాలు రేపు చూడబోతున్నాం. పవన్ డిప్యూటీ సిఎంగా పదవి స్వీకరిస్తారనే న్యూస్ ఆల్రెడీ తిరుగుతోంది. రేపు మాములు సందడి ఉండేలా లేదు.
This post was last modified on June 11, 2024 9:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…