నిన్న సాయంత్రం భారీ ఆశలు అంచనాల మధ్య విడుదలైన కల్కి 2898 ఏడి ట్రైలర్ ఊహించినట్టే వ్యూస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. దర్శకుడు నాగ అశ్విన్ ఊహా ప్రపంచాన్ని చూసి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. షూటింగ్ జరిగినంత కాలం ఎలాంటి లీక్ బయటికి రాకుండా జాగ్రత్త పడిన టీమ్ ఒక్కసారిగా మూడు నిమిషాల వీడియోతో ఆశ్చర్యానికి గురి చేసింది. మహానటి తర్వాత ఏళ్ళ తరబడి గ్యాప్ తీసుకున్న నాగఅశ్విన్ నిజంగా తపస్సే చేశాడనే రేంజ్ లో కట్టిపడేసాడు. అయితే ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఇందులో ఒకటుంది. అదే కమల్ హాసన్ గెటప్.
ఆయన్ని రెండు మూడు షాట్లలోనే చూపించినా వయసు మళ్ళిన గెటప్ లో ఇండియన్ 2నే గుర్తు చేశాడనే కామెంట్ ని కాదనలేం. ఎందుకంటే వయసు, మేకప్ పరంగా చూస్తే ప్రస్తుతానికి పోలికలు దగ్గరగా ఉన్నాయి. తన కథకు సూటయ్యేలా ఎలాగూ సేనాపతి ఉన్నాడు కానీ చిన్నపాటి మార్పులు చేసుకుని నాగఅశ్విన్ లోకనాయకుడిని వాడుకున్నాడా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేం కానీ కల్కిలో ఆయన పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందనే లీక్ కొన్ని వారాల క్రితమే లీకైపోయింది. రెండో భాగంలో ఎక్కువసేపు ఉంటాడని యూనిట్ టాక్.
రిలీజ్ అయ్యేంత వరకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. స్టోరీ గురించి ఎక్కువ డీటెయిల్స్ లేకుండా ట్రైలర్ కట్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్న వైనం కూడా కనిపించింది. దీపికా పదుకునే గర్భంతో ఉండటం, అమితాబ్ ఆ బిడ్డను కాపాడే బాధ్యతను తీసుకోవడం, బుజ్జి వాహనాన్ని తీసుకుని భైరవ వస్తే మరి కల్కి ఎవరనే డౌట్ రావడం ఇలా చెప్పుకుంటూ పోతే సుడోకు పజిల్ లాగా మారిపోతుంది. జూన్ 27 థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయమని, టికెట్ల కోసం ఫోన్లు రావడం నెలల తర్వాత థియేటర్ యజమానులు చూడబోతున్నారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.
This post was last modified on June 11, 2024 11:32 am
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…