రామోజీరావు అనగానే ఈనాడు ప్రస్థానమే సగటు ప్రజలకు గుర్తొస్తుంది కానీ అంతే స్థాయిలో సితార మ్యాగజైన్ గురించిన కథలు వందల వేల జ్ఞాపకాల రూపంలో సినీ ప్రియుల మనసుల్లో మెదులుతాయి. 70 దశకం చివర్లో సినిమా పత్రికలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఒక ప్రభంజనంలా సితారని తీసుకొచ్చారు రామోజీరావు. స్టార్ల ఫోటోలు, షూటింగ్ విశేషాలు, అరుదైన ఇంటర్వ్యూలు, పాత కాలం సంగతులు, పెద్ద సైజ్ బ్లో అప్పులు, ప్రత్యేక కథనాలు, ఎవరికీ తెలియని విషయాలు ఇలా ఎన్నెన్నో శీర్షికలతో ప్రతి శుక్రవారం సినీ ప్రియులు పుస్తకాల దుకాణాల వద్ద ఎదురు చూసే స్థాయిలో సితారను పెంచారు.
రూపాయి నుంచి పది రూపాయల దాకా రెండు దశాబ్దాల ప్రస్థానంలో సితారని ఎన్ని కోట్ల మంది చదివి ఉంటారో లెక్క చెప్పడం కష్టం. తొంభై దశకం చివర్లో మొదలుపెట్టిన ఈటీవీ మరో సెన్సేషన్. శాటిలైట్ ఛానల్స్ తెలుగు నెలపై మొగ్గ తొడుగుతున్న సమయంలో కేవలం పరిమిత కాల ప్రసారాలకు పరిమితమైన ట్రెండ్ లో ఇరవై నాలుగు గంటల టెలికాస్ట్ తో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దూరదర్శన్ లో వారానికి ఒక సినిమా చూడటమే అదృష్టంగా భావించే రోజుల్లో రోజుకు రెండు ప్రసారం చేసి అద్భుత ఆణిముత్యాలను ముంగిట్లోకి తీసుకొచ్చారు. టీవీ సీరియల్స్ ది మరో గొప్ప అధ్యాయం.
అంతరంగాలు, భాగవతం లాంటి ధారావాహికలతో జనం వాటి కోసమే పనులు పూర్తి చేసుకుని ఎదురు చూసే స్థాయిలో అందించారు. రోజు ఉదయం, రాత్రి వచ్చే న్యూస్ బులెటిన్ కోసం ఇప్పటికీ ఎదురు చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. పోటీ ఛానల్స్ తాకిడి పెరిగి వైరల్ న్యూస్ తోనే గడిపేస్తున్న కాంపిటీషన్ ప్రపంచంలో ఎలాంటి వైరల్ వార్తల కోసం పాకులాడకుండా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నది ఈటీవీ మాత్రమే. సితార ఇప్పుడు లేకపోవచ్చు ఈటీవీ మాత్రం తన ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. వినోద రంగంలో ఇవి చూపించిన ప్రభావం, రామోజీరావుగారి విజన్ ఎప్పటికీ మర్చిపోయేది కాదు.
This post was last modified on June 8, 2024 11:42 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…