తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ కేవలం యూట్యూబ్ లో తన సినిమాల వ్యూస్ చూసి ఛత్రపతి రీమేక్ కోసం మూడేళ్లు త్యాగం చేసిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దాని ఫలితం దెబ్బకు తిరిగి టాలీవుడ్ కు వచ్చేశాడు. ఆన్ లైన్లో ఉత్తరాది ప్రేక్షకులు చూపించే అభిమానం థియేటర్ కలెక్షన్లుగా మారదని అర్థం చేసుకుని ఇక్కడ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంల టైసన్ నాయుడు చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కొంత ఆలస్యమవుతున్నప్పటికీ స్పీడ్ పెంచి ఇంకో రెండు మూడు నెలల్లో గుమ్మడికాయ కొట్టబోతున్నారు.
తాజాగా ఓ సీరియస్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అల్లరి నరేష్ తో నాంది తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ కనకమేడలతో ప్రాజెక్టుకు రంగం సిద్ధమయ్యింది. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. నాంది తర్వాత అదే హీరోతో విజయ్ తీసిన ఉగ్రమ్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. టేకింగ్ పరంగా లోపం లేకపోయినప్పటికీ కథనంలో ఉన్న తప్పుల వల్ల ఫ్లాప్ అయ్యింది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సాయి శ్రీనివాస్ కి ఇప్పటిదాకా రాని మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నట్టు వినికిడి.
ఇవి కాకుండా కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో సాయిశ్రీనివాస్ ఆల్రెడీ ఒక ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేవలం ప్రొడక్షన్ ఖర్చే యాభై కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. కిష్కిందపురి పేరు పరిశీలనలో ఉంది. చావు కబురు చల్లగా లాంటి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ కథ మీద నమ్మకంతో కౌశిక్ కి ఈ ఛాన్స్ దక్కింది. మరో రెండు స్టోరీలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. స్టోరీ నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డు చూడకుండా సాయిశ్రీనివాస్ ఓకే చెబుతున్నాడు. 2025లో కనీసం రెండు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే మళ్ళీ కుదురుకోవచ్చు.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…