పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డెబ్యూ అకీరానందన్ దే. తల్లి రేణు దేశాయ్ తో తండ్రి విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అకీరా మాత్రం ఇద్దరి దగ్గరా సమయం గడుపుతూ ఉంటాడు. గత కొంత కాలంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఏదో బయట ఈవెంట్లు, థియేటర్లలో హడావిడిగా ఫోటోలకు దొరకడం తప్ప తన లుక్స్ పూర్తిగా ఎలా ఉంటాయనే అవగాహన సామాన్య ప్రేక్షకుల్లో లేదు. పవన్ కూడా ఏనాడూ తన సినిమా వేడుకలకు అదే పనిగా తీసుకొచ్చింది లేదు. కానీ జనసేన అఖండ విజయం సాధించాక ప్లాన్ మార్చేశాడు.
అకీరాను ప్రత్యేకంగా మీడియాలో హైలైట్ అయ్యేలా తమ వెంట తీసుకెళ్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చంద్రబాబునాయుడు ఇంటికి వచ్చినప్పుడు కొడుకుని పరిచయం చేయడమే కాక కాళ్లకు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేసి ఆయన బ్లెస్సింగ్స్ ని అందుకునేలా చేశాడు. దెబ్బకు ఇప్పుడు జాతీయ ఛానల్స్ లోనూ అకీరా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పేదేముంది. సరైన సమయంలో అకీరాని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్న పవన్ తెలివికి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
నిజానికి ఇదంతా సినిమాలకు సంబంధం లేని వ్యవహారమే అయినా రేపు ఎప్పుడైనా తెరంగేట్రం సిద్ధం చేసినప్పుడు ఎంత వద్దన్నా భారీ స్థాయిలో అకీరా మీదకు ఫోకస్ వచ్చేస్తుంది. ఒకవేళ నటననే కెరీర్ గా ఎంచుకుంటానంటే అభ్యంతరం చెప్పనని గతం రేణు దేశాయ్ చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని ఆరు అడుగులపైనే ఉన్న అకీరాని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అకీరానందన్ సైతం పవన్ తో పాటు పిన్ని అన్నాతో కలిసి ప్రతిచోటా మొహమాటం లేకుండా కలివిడిగా తిరుగుతూ తండ్రి చెప్పింది చేస్తూ నలుగురి దృష్టిలో పడుతున్నాడు.
This post was last modified on June 6, 2024 4:38 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…