పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డెబ్యూ అకీరానందన్ దే. తల్లి రేణు దేశాయ్ తో తండ్రి విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అకీరా మాత్రం ఇద్దరి దగ్గరా సమయం గడుపుతూ ఉంటాడు. గత కొంత కాలంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఏదో బయట ఈవెంట్లు, థియేటర్లలో హడావిడిగా ఫోటోలకు దొరకడం తప్ప తన లుక్స్ పూర్తిగా ఎలా ఉంటాయనే అవగాహన సామాన్య ప్రేక్షకుల్లో లేదు. పవన్ కూడా ఏనాడూ తన సినిమా వేడుకలకు అదే పనిగా తీసుకొచ్చింది లేదు. కానీ జనసేన అఖండ విజయం సాధించాక ప్లాన్ మార్చేశాడు.
అకీరాను ప్రత్యేకంగా మీడియాలో హైలైట్ అయ్యేలా తమ వెంట తీసుకెళ్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చంద్రబాబునాయుడు ఇంటికి వచ్చినప్పుడు కొడుకుని పరిచయం చేయడమే కాక కాళ్లకు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేసి ఆయన బ్లెస్సింగ్స్ ని అందుకునేలా చేశాడు. దెబ్బకు ఇప్పుడు జాతీయ ఛానల్స్ లోనూ అకీరా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పేదేముంది. సరైన సమయంలో అకీరాని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్న పవన్ తెలివికి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
నిజానికి ఇదంతా సినిమాలకు సంబంధం లేని వ్యవహారమే అయినా రేపు ఎప్పుడైనా తెరంగేట్రం సిద్ధం చేసినప్పుడు ఎంత వద్దన్నా భారీ స్థాయిలో అకీరా మీదకు ఫోకస్ వచ్చేస్తుంది. ఒకవేళ నటననే కెరీర్ గా ఎంచుకుంటానంటే అభ్యంతరం చెప్పనని గతం రేణు దేశాయ్ చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని ఆరు అడుగులపైనే ఉన్న అకీరాని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అకీరానందన్ సైతం పవన్ తో పాటు పిన్ని అన్నాతో కలిసి ప్రతిచోటా మొహమాటం లేకుండా కలివిడిగా తిరుగుతూ తండ్రి చెప్పింది చేస్తూ నలుగురి దృష్టిలో పడుతున్నాడు.
This post was last modified on June 6, 2024 4:38 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…