పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డెబ్యూ అకీరానందన్ దే. తల్లి రేణు దేశాయ్ తో తండ్రి విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అకీరా మాత్రం ఇద్దరి దగ్గరా సమయం గడుపుతూ ఉంటాడు. గత కొంత కాలంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఏదో బయట ఈవెంట్లు, థియేటర్లలో హడావిడిగా ఫోటోలకు దొరకడం తప్ప తన లుక్స్ పూర్తిగా ఎలా ఉంటాయనే అవగాహన సామాన్య ప్రేక్షకుల్లో లేదు. పవన్ కూడా ఏనాడూ తన సినిమా వేడుకలకు అదే పనిగా తీసుకొచ్చింది లేదు. కానీ జనసేన అఖండ విజయం సాధించాక ప్లాన్ మార్చేశాడు.
అకీరాను ప్రత్యేకంగా మీడియాలో హైలైట్ అయ్యేలా తమ వెంట తీసుకెళ్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చంద్రబాబునాయుడు ఇంటికి వచ్చినప్పుడు కొడుకుని పరిచయం చేయడమే కాక కాళ్లకు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేసి ఆయన బ్లెస్సింగ్స్ ని అందుకునేలా చేశాడు. దెబ్బకు ఇప్పుడు జాతీయ ఛానల్స్ లోనూ అకీరా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పేదేముంది. సరైన సమయంలో అకీరాని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్న పవన్ తెలివికి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
నిజానికి ఇదంతా సినిమాలకు సంబంధం లేని వ్యవహారమే అయినా రేపు ఎప్పుడైనా తెరంగేట్రం సిద్ధం చేసినప్పుడు ఎంత వద్దన్నా భారీ స్థాయిలో అకీరా మీదకు ఫోకస్ వచ్చేస్తుంది. ఒకవేళ నటననే కెరీర్ గా ఎంచుకుంటానంటే అభ్యంతరం చెప్పనని గతం రేణు దేశాయ్ చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని ఆరు అడుగులపైనే ఉన్న అకీరాని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అకీరానందన్ సైతం పవన్ తో పాటు పిన్ని అన్నాతో కలిసి ప్రతిచోటా మొహమాటం లేకుండా కలివిడిగా తిరుగుతూ తండ్రి చెప్పింది చేస్తూ నలుగురి దృష్టిలో పడుతున్నాడు.
This post was last modified on June 6, 2024 4:38 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…