కథ నచ్చి పెర్ఫార్మన్స్ కి విపరీతమైన స్కోప్ ఉంటే తప్ప ఎంత పారితోషికం ఇచ్చినా ఒప్పుకోని సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ చేస్తోంది. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యతో మళ్ళీ జట్టు కడుతోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను గీతా ఆర్ట్స్ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది కాకుండా రన్బీర్ కపూర్ తో రామాయణంలో బిజీ కావడంతో ఫిదా భాగమతి డేట్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అయినా సరే విజయ్ దేవరకొండతో కాంబో చేసేందుకు నిర్మాత దిల్ రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.
రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఎలాగైనా సాయిపల్లవిని ఒప్పించాలని దర్శకుడి ఆలోచనట. ఎస్విసి బ్యానర్ లో తను రెండు సినిమాలు చేసింది. ఫిదా బ్లాక్ బస్టర్ కాగా నాని ఎంసిఏ కమర్షియల్ గా మంచి విజయం నమోదు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ చేయించాలనే ఉద్దేశంతో దిల్ రాజు కథను చెప్పించారట. విని ఆశ్చర్యపోయిన సాయిపల్లవి కాల్ షీట్లు చెక్ చేసుకుని తన అంగీకారాన్ని వీలైనంత త్వరగా చెబుతానని అందట.
కాపీ రైట్స్ వివాదంలో ఉన్న రామాయణం షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడిందనే నేపథ్యంలో అది నిజమో కాదో మేకర్స్ నుంచి సరైన సమాచారం రావడం లేదు. ఒకవేళ వాస్తవమైతే మాత్రం రౌడీ బాయ్ సినిమాకు కాల్ షీట్లు ఇవ్వొచ్చు. కానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు మైత్రి నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ మూవీ ఉంది . కాకపోతే ఏది ముందు ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరి మొదటిసారి విజయ్ దేవరకొండతో జోడిగా చేయబోయే అవకాశాన్ని సాయిపల్లవి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…