చియాన్ విక్రమ్ అంటే టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అపరిచితుడు పుణ్యమాని ఇక్కడా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తర్వాత వరస ఫెయిల్యూర్స్ తర్వాత మార్కెట్ తగ్గిందేమో కానీ ప్రేక్షకుల్లో తన కమిట్ మెంట్ పట్ల గౌరవం మాత్రం అలాగే ఉంది. శంకర్ ఐ ఎంత డిజాస్టర్ అయినా విక్రమ్ ప్రాణాలు పణంగా పెట్టి దానికి కష్టపడిన వైనం ఫ్యాన్స్ నే కాదు సామాన్య ఆడియన్స్ ని సైతం కదిలించింది. ఇప్పుడు అంతే స్థాయిలో ఒళ్ళు హూనం చేసుకున్న తంగలాన్ విడుదలకు సిద్ధమవుతోంది. వెనుకబడిన భావజాలాన్ని గొప్పగా ఆవిష్కరించే పా రంజిత్ దర్శకుడు.
దీనికొచ్చిన ఇరకాటం ఏంటంటే అనుకున్న దానికన్నా బడ్జెట్ బాగా చేతులు దాటిపోయింది. కంటెంట్ ఏమో షాకింగ్ గా ఉంది కానీ మాస్ వర్గాలను ఎంత మేరకు ఆకట్టుకుందోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఈ కారణంగానే బయ్యర్లు భారీ అడ్వాన్సులు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారట. ముఖ్యంగా ఇతర బాషల నుంచి హక్కుల కోసం ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదని వినికిడి. మణిరత్నం అంటి దిగ్గజం పొన్నియిన్ సెల్వన్ తీస్తే అది తమిళంలో మాత్రమే బాగా ఆడింది. తెలుగులో అతి కష్టం మీద గట్టెక్కింది. అలాంటిది తంగలాన్ లాంటి టిపికల్ మూవీకి క్రేజీ ఆఫర్లు కష్టం.
ఇంకో సమస్య విడుదల తేదీ. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ఖరారు చేసుకోలేదు. ముందు 2024 జనవరి చివరి వారం అనుకుని ఆ మేరకు పోస్టర్ కూడా వదిలారు. కానీ సాధ్యపడలేదు. తర్వాత సమ్మర్ అనుకున్నారు. తీరా చూస్తే వేసవి సీజన్ అయిపోతోంది. పోనీ దసరా లేదా దీపావళి చూద్దామంటే వరసగా విజయ్ గోట్ గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, రజినీకాంత్ వెట్టాయన్, జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వగైరాలు కాచుకుని ఉన్నాయి. డిసెంబర్ దాకా ఆగుదామంటే వడ్డీల భారం. భారీ నిర్మాణ సంస్థలే నిర్మించినప్పటికీ అనుకున్న టైంలో అన్నీ జరగకపోతే ఇబ్బంది తప్పదుగా.
This post was last modified on June 5, 2024 5:37 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…