చియాన్ విక్రమ్ అంటే టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అపరిచితుడు పుణ్యమాని ఇక్కడా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తర్వాత వరస ఫెయిల్యూర్స్ తర్వాత మార్కెట్ తగ్గిందేమో కానీ ప్రేక్షకుల్లో తన కమిట్ మెంట్ పట్ల గౌరవం మాత్రం అలాగే ఉంది. శంకర్ ఐ ఎంత డిజాస్టర్ అయినా విక్రమ్ ప్రాణాలు పణంగా పెట్టి దానికి కష్టపడిన వైనం ఫ్యాన్స్ నే కాదు సామాన్య ఆడియన్స్ ని సైతం కదిలించింది. ఇప్పుడు అంతే స్థాయిలో ఒళ్ళు హూనం చేసుకున్న తంగలాన్ విడుదలకు సిద్ధమవుతోంది. వెనుకబడిన భావజాలాన్ని గొప్పగా ఆవిష్కరించే పా రంజిత్ దర్శకుడు.
దీనికొచ్చిన ఇరకాటం ఏంటంటే అనుకున్న దానికన్నా బడ్జెట్ బాగా చేతులు దాటిపోయింది. కంటెంట్ ఏమో షాకింగ్ గా ఉంది కానీ మాస్ వర్గాలను ఎంత మేరకు ఆకట్టుకుందోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఈ కారణంగానే బయ్యర్లు భారీ అడ్వాన్సులు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారట. ముఖ్యంగా ఇతర బాషల నుంచి హక్కుల కోసం ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదని వినికిడి. మణిరత్నం అంటి దిగ్గజం పొన్నియిన్ సెల్వన్ తీస్తే అది తమిళంలో మాత్రమే బాగా ఆడింది. తెలుగులో అతి కష్టం మీద గట్టెక్కింది. అలాంటిది తంగలాన్ లాంటి టిపికల్ మూవీకి క్రేజీ ఆఫర్లు కష్టం.
ఇంకో సమస్య విడుదల తేదీ. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ఖరారు చేసుకోలేదు. ముందు 2024 జనవరి చివరి వారం అనుకుని ఆ మేరకు పోస్టర్ కూడా వదిలారు. కానీ సాధ్యపడలేదు. తర్వాత సమ్మర్ అనుకున్నారు. తీరా చూస్తే వేసవి సీజన్ అయిపోతోంది. పోనీ దసరా లేదా దీపావళి చూద్దామంటే వరసగా విజయ్ గోట్ గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, రజినీకాంత్ వెట్టాయన్, జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వగైరాలు కాచుకుని ఉన్నాయి. డిసెంబర్ దాకా ఆగుదామంటే వడ్డీల భారం. భారీ నిర్మాణ సంస్థలే నిర్మించినప్పటికీ అనుకున్న టైంలో అన్నీ జరగకపోతే ఇబ్బంది తప్పదుగా.
This post was last modified on June 5, 2024 5:37 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…