తొలి మూడు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న అక్కినేని అఖిల్.. నాలుగో సినిమాతో హిట్టు కొట్టేవాడో లేదో ఐదు నెలల కిందటే తేలిపోవాల్సింది. అతడి కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను మేలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వచ్చి బ్రేక్ వేసింది. ఆరు నెలల పాటు అందరిలానే ఈ చిత్ర బృందం సైతం చిత్రీకరణ ఆపేసి సైలెంటుగా ఉండిపోయింది.
ఐతే ఈ మధ్య కరోనా సోకకుండా నిబంధనలు పాటిస్తూనే చిత్రీకరణలు పున:ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీం కూడా అలాగే షరతుల మధ్య చిత్రీకరణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా లొకేషన్ నుంచి అఖిల్, పూజా హెగ్డేల ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. విరామం లేకుండా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోయేది లొకేషన్ నుంచి ఒక వీడియో ద్వారా అఖిల్ వెల్లడించడం విశేషం. సంక్రాంతి అయ్యాక తర్వాతి వారంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను విడుదల చేస్తారట. జనవరి 21 అంటూ డేట్ కూడా చెప్పేశాడు అఖిల్. గత ఏడాది అఖిల్ మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ను సైతం సంక్రాంతి తర్వాతి వారంలో రిలీజ్ చేశారు. ఈసారి సంక్రాంతి సినిమాల విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఏ చిత్రమూ సంక్రాంతికి ఖరారవ్వలేదు.
అయినప్పటికీ పండగ పోటీలో నిలవకుండా తర్వాతి వారం తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది అలా విడుదలైన ‘డిస్కో రాజా’కు చేదు అనుభవం మిగిలింది. సంక్రాంతి సినిమాల్ని విరగబడి చూసిన జనాలు.. తర్వాత వచ్చిన ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఆ అనుభవం తర్వాత కూడా అఖిల్ ఈ డేట్ ఎంచుకున్నాడంటే రిస్క్ చేస్తున్నట్లే.
This post was last modified on September 19, 2020 7:46 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…