Movie News

‘బ్యాచిలర్’ డేట్ చెప్పేసిన అఖిల్

తొలి మూడు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న అక్కినేని అఖిల్.. నాలుగో సినిమాతో హిట్టు కొట్టేవాడో లేదో ఐదు నెలల కిందటే తేలిపోవాల్సింది. అతడి కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను మేలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వచ్చి బ్రేక్ వేసింది. ఆరు నెలల పాటు అందరిలానే ఈ చిత్ర బృందం సైతం చిత్రీకరణ ఆపేసి సైలెంటుగా ఉండిపోయింది.

ఐతే ఈ మధ్య కరోనా సోకకుండా నిబంధనలు పాటిస్తూనే చిత్రీకరణలు పున:ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీం కూడా అలాగే షరతుల మధ్య చిత్రీకరణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా లొకేషన్ నుంచి అఖిల్, పూజా హెగ్డేల ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. విరామం లేకుండా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

కాగా ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోయేది లొకేషన్ నుంచి ఒక వీడియో ద్వారా అఖిల్ వెల్లడించడం విశేషం. సంక్రాంతి అయ్యాక తర్వాతి వారంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను విడుదల చేస్తారట. జనవరి 21 అంటూ డేట్ కూడా చెప్పేశాడు అఖిల్. గత ఏడాది అఖిల్ మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ను సైతం సంక్రాంతి తర్వాతి వారంలో రిలీజ్ చేశారు. ఈసారి సంక్రాంతి సినిమాల విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఏ చిత్రమూ సంక్రాంతికి ఖరారవ్వలేదు.

అయినప్పటికీ పండగ పోటీలో నిలవకుండా తర్వాతి వారం తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది అలా విడుదలైన ‘డిస్కో రాజా’కు చేదు అనుభవం మిగిలింది. సంక్రాంతి సినిమాల్ని విరగబడి చూసిన జనాలు.. తర్వాత వచ్చిన ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఆ అనుభవం తర్వాత కూడా అఖిల్ ఈ డేట్ ఎంచుకున్నాడంటే రిస్క్ చేస్తున్నట్లే.

This post was last modified on September 19, 2020 7:46 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

52 minutes ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

2 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

3 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

4 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago