ఒకప్పుడు ఏదైనా పెద్ద సినిమాకు సంబంధించి రీషూట్లు జరుగుతున్నాయి అంటే అభిమానులు కంగారు పడిపోయేవాళ్లు. తీసిన సీన్లే మళ్లీ తీస్తున్నారంటే సినిమా ఏదో తేడా కొడుతోందనే సంకేతాలు వెళ్లేవి. రీషూట్లు చేయడాన్ని నెగెటివ్ సెంటిమెంట్గా చూసేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సినిమాలకు రీషూట్లు చేయడం ద్వారానే బెటర్ ఔట్ పుట్ తీసుకువచ్చి ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పడంతో ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకుల ఆలోచన తీరు మారింది.
ఏదైనా సన్నివేశం బాలేకుంటే రీషూట్ చేసి దాన్ని మెరుగు పరిస్తే సినిమాకు మంచే తప్ప చెడేముంది అనే భావన మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఔట్ పుట్ విషయంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా రీషూట్లకు వెళ్తున్నారు. తాజాగా ‘పుష్ప-2’ టీం కూడా ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం.
పుష్ప-2 విడుదలకు ఇంకో 75 రోజులే సమయం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఈపాటికి షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండాలి. కానీ ఇంకా కూడా షూట్ పూర్తి కాలేదు. దాదాపుగా టాకీ పార్ట్ అంతా అయిపోయినప్పటికీ.. కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారట.
స్వయంగా అల్లు అర్జునే తాను చేసిన కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ అవి చేద్దామని అనడంతో ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఆ సీన్లను రీషూట్ చేస్తున్నట్లు తెలిసింది. ఇది కాక కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందట. రెండు మూడు వారాల్లో ప్యాచ్ వర్క్ అంతా అవగొట్టి గుమ్మడికాయ కొట్టేయాలని టీం చూస్తోంది. తర్వాతి రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా పూర్తి చేసి ‘పుష్ప’ తరహాలో కాకుండా హడావుడి లేకుండా ప్రశాంతంగా సినిమాను రిలీజ్ చేయాలని సుక్కు అండ్ కో భావిస్తోంది.
This post was last modified on June 3, 2024 4:36 pm
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…
జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు శనివారం కూడా.. పిఠాపురంలో పర్యటించారు. శుక్రవారం పిఠాపురానికి వెళ్లిన ఆయన..…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేసవి కాలం ప్రారంభం అయిన నేపథ్యంలో సాగు, తాగు నీటి…