కల్కి 2898 ఏడి విడుదల నెలల నుంచి రోజుల్లోకి మారిపోయింది. ప్రమోషన్ల విషయంలో కాస్త నెమ్మదిగా ఉందని ఫీలవుతున్న అభిమానులకు రోజుకో కంటెంట్ తో విందు భోజనం అందించేందుకు వైజయంతి టీమ్ రెడీ అవుతోంది. అందులో భాగంగా కల్కి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి యానిమేటెడ్ సిరీస్ ని ఉపయోగించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా రెండు ఎపిసోడ్లను చూపించి మిగిలిన రెండు సినిమా విడుదల తర్వాత వదిలేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవన్నీ స్ట్రీమింగ్ రూపంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా మే 31 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
భైరవ బుజ్జిల పరిచయం ఎలా జరిగింది, ఇద్దరు కలిసి ఊహాతీతమైన ఒక అద్భుతాన్ని సృష్టించేందుకు ఏం చేశారనేది ఇందులో చూపించారు. ప్రభాస్, కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన బుజ్జి మెషీన్ తో పాటు బ్రహ్మానందం లాంటి సర్ప్రైజ్ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. సినిమాలో లేనిది మాత్రమే ఇందులో చూపించామని దర్శకుడు నాగ అశ్విన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే షాక్ కలిగించే విజువల్స్ ని అసలు తెరపై చూడబోతున్నామని అర్థమవుతోంది. ఇంకా కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరుల ఇంట్రోలు అభిమానులకు చూపించాల్సి ఉంది.
జూన్ 27 ఎంతో దూరంలో లేనందు వల్ల కల్కి బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు మరికొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు వివిధ నగరాల్లో చేయబోతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామా సుమారు ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. అంచనాలను కనక అందుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి ఖాయం. యానిమేషన్ ట్రైలర్ కే ఇంత ఎక్స్ పెక్టేషన్లు పెరుగుతున్నాయంటే ఇక అసలు ట్రైలర్ వచ్చాక ఏ స్థాయి హైప్ వస్తుందో ఊహించుకోవడం కష్టమే.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…