కల్కి 2898 ఏడి విడుదల నెలల నుంచి రోజుల్లోకి మారిపోయింది. ప్రమోషన్ల విషయంలో కాస్త నెమ్మదిగా ఉందని ఫీలవుతున్న అభిమానులకు రోజుకో కంటెంట్ తో విందు భోజనం అందించేందుకు వైజయంతి టీమ్ రెడీ అవుతోంది. అందులో భాగంగా కల్కి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి యానిమేటెడ్ సిరీస్ ని ఉపయోగించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా రెండు ఎపిసోడ్లను చూపించి మిగిలిన రెండు సినిమా విడుదల తర్వాత వదిలేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవన్నీ స్ట్రీమింగ్ రూపంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా మే 31 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
భైరవ బుజ్జిల పరిచయం ఎలా జరిగింది, ఇద్దరు కలిసి ఊహాతీతమైన ఒక అద్భుతాన్ని సృష్టించేందుకు ఏం చేశారనేది ఇందులో చూపించారు. ప్రభాస్, కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన బుజ్జి మెషీన్ తో పాటు బ్రహ్మానందం లాంటి సర్ప్రైజ్ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. సినిమాలో లేనిది మాత్రమే ఇందులో చూపించామని దర్శకుడు నాగ అశ్విన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే షాక్ కలిగించే విజువల్స్ ని అసలు తెరపై చూడబోతున్నామని అర్థమవుతోంది. ఇంకా కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరుల ఇంట్రోలు అభిమానులకు చూపించాల్సి ఉంది.
జూన్ 27 ఎంతో దూరంలో లేనందు వల్ల కల్కి బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు మరికొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు వివిధ నగరాల్లో చేయబోతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామా సుమారు ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. అంచనాలను కనక అందుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి ఖాయం. యానిమేషన్ ట్రైలర్ కే ఇంత ఎక్స్ పెక్టేషన్లు పెరుగుతున్నాయంటే ఇక అసలు ట్రైలర్ వచ్చాక ఏ స్థాయి హైప్ వస్తుందో ఊహించుకోవడం కష్టమే.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…