Movie News

‘మహాసముద్రం’తో మాస్టర్ ప్లాన్

బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమాలో హీరోగా చేసిన కార్తికేయ.. దాని తర్వాత ఐదోదో ఆరోదో సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ పాయల్ అదే సంఖ్యలో సినిమాలు చేసింది. కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘మహాసముద్రం’ పట్టాలెక్కబోతోంది. ఇందులో ఓ కథానాయకుడిగా శర్వానంద్ నటిస్తాడని కొన్ని రోజుల కిందటే వెల్లడైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోగా తమిళ నటుడు సిద్దార్థ్ నటిస్తాడని వెల్లడించారు. కాబట్టి ఇది మీడియం రేంజ్ మల్టీస్టారర్ అన్నమాట. తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిన సిద్ధును ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులోకి హీరోగా తీసుకోవడం విశేషమే. అతను ఈ సినిమాను ఒప్పుకోవడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఐతే తొలి సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చినప్పటికీ.. రెండో సినిమా విషయంలో మంచి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగాడు అజయ్. అతడి కథలో మంచి దమ్ము కనిపించడంతో భారీ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి నిర్మాత అనిల్ సుంకర ముందుకొచ్చాడు. శర్వానంద్ ఇప్పటికే ‘జేకే’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు బాగానే పరిచయం. సిద్ధు ఎలాగూ తమిళుడే ఆయె. దీంతో తమిళంలోనూ ఈ సినిమాను చక్కగా ప్రమోట్ చేసి పెద్ద రేంజిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం రెండు భాషలకూ తెలిసిన హీరోయిన్లు, విలన్లనే పెట్టబోతున్నారు. సిద్ధు తెలుగువారికి కొత్త కాదు కాబట్టి ఇక్కడా సమస్య లేదు. మల్టీస్టారర్, పైగా రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని అజయ్ చూస్తున్నాడు. మరి అతడి ప్లాన్ ఏ మేర వర్కవుట్ అవుతుందో.. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తనపై నెలకొన్న అంచనాలను అతను ఏమాత్రం అందుకుంటాడో చూడాలి.

This post was last modified on September 19, 2020 12:41 am

Share
Show comments
Published by
suman
Tags: Mahasamudram

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago