ఇంకో అయిదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. ఎల్లుండి నుంచి ఎగ్జిట్ పోల్స్ హడావిడి మొదలైపోతుంది. ఎవరు గెలుస్తారనే దాని మీద లెక్కలేనన్ని అంచనాలు, కోట్లాది రూపాయల బెట్టింగులు జరిగిపోతున్నాయి. ప్రత్యేకించి అందరి దృష్టి పిఠాపురం మీదే ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానం కావడంతో పాటు ఖచ్చితంగా గెలుస్తాడనే ధీమా జనసేన వర్గాలతో సమానంగా టీడీపీ శ్రేణులు కూడా వ్యక్తం చేయడంతో అభిమానులు ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ 4 హంగామా ఊహించడం కష్టం.
ఇదంతా పక్కనపెడితే పవన్ ఫ్యాన్స్ తమ బండ్లకు, కార్లకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వేయిస్తున్న రేడియం స్టిక్కర్లు ఏపీ మొత్తం ట్రెండ్ గా మారిపోయాయి. వీటిని తయారు చేసే దుకాణాల దగ్గర అభిమానులు క్యూలో నిలబడి మరీ చేయించుకుంటున్నారు. నిజానికి ఇలా చేయడం మోటార్ యాక్ట్ ప్రకారం తప్పు. రవాణా అధికారులు పట్టుకుంటే క్షణం ఆలస్యం చేయకుండా తీయించేస్తారు. ఇది తెలిసి కూడా వందలు వేలు ఖర్చు పెట్టడం విశేషం. ఈ వీడియోలు ఆన్ లైన్ చూసిన ఇతర కుర్రకారు అదే స్టయిల్ లో తమకూ కావాలంటూ షాపులకు పరుగులు పెడుతున్నారు.
ఇదంతా గమనిస్తున్న ఒక మీడియం రేంజ్ నిర్మాత వెంటనే ఎమ్మెల్యే గారి తాలూకా టైటిల్ ని రిజిస్టర్ చేయించే పనిలో ఉన్నట్టు సమాచారం. కథ, దర్శకుడు సిద్ధంగా లేకపోయినా రేపు పవన్ గెలిచాక ఈ పేరుకి డిమాండ్ వస్తుంది కాబట్టి సినిమా తీసినా తీయకపోయినా కేవలం పేరు లక్షల్లో సొమ్ములు తెచ్చేలా ఉంది. ఇప్పటికే పలువురు షార్ట్ ఫిలిం మేకర్స్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ చేసిన పొట్టి వీడియోలు వైరలవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులో పని జరక్కపోతే పిఠాపురం పేరు వాడేసుకున్న వైనం అందులో చూపిస్తున్నారు. దగ్గరలో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on May 30, 2024 4:01 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…