Movie News

రాక్షస్ సస్పెన్సుకి శుభం కార్డు

గత వారం పదిరోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ దాకా అన్ని మీడియాల్లోనూ బాగా హైలైట్ అయిన వార్త రణ్వీర్ సింగ్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ ప్యాన్ ఇండియా మూవీ రాక్షస్. ఉందని ఒకసారి ఉందని, లేదు క్యాన్సిల్ చేశారని మరోసారి ఇలా ఏవేవో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అభిమానులు ఏవి నిజమో ఏవి అబద్దమో తెలియని అయోమయంలో పడ్డారు. దానికి తోడు యూనిట్ నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని  క్లారిఫికేషన్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు మరింత కన్ఫ్యూజన్ పెంచాయి. ఎట్టకేలకు అన్నింటికి చెక్ పెడుతూ టీమ్ తరఫున అఫీషియల్ నోట్ వచ్చింది.

అనుకున్నట్టే రాక్షస్ కొనసాగడం లేదు. హీరో, దర్శకుడు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి వచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా ఇకపై ఇది నిర్మాణంలోకి వెళ్లడం లేదు. రణ్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన వాడిగా పేర్కొంటూ, కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా సాధ్యపడలేదని, భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన స్టేట్ మెంట్ లో రణ్వీర్ ఎనర్జీ, టాలెంట్ అరుదుగా దొరికే రకమని, త్వరలో తమ కలయిక సాధ్యం కావడం కోసం ఎదురు చూస్తుంటానని ఉంది. మైత్రి తరఫున టైం వచ్చినప్పుడు అన్నీ కుదురుతాయని ముగింపు పలికింది.

మొత్తానికి హనుమాన్ తర్వాత భారీ బాలీవుడ్ డెబ్యూ అందుకోబోతున్న తరుణంలో ప్రశాంత్ వర్మకు ఇది ట్విస్టే కానీ అంత ఫీలవ్వాల్సిన పని కూడా లేదనే చెప్పాలి. ఏ షారుఖ్ ఖానో అయితే అయ్యో అనుకోవచ్చు కానీ రణ్వీర్ సింగే కాబట్టి తీవ్రంగా కోల్పోయిందేమి లేదు. జై హనుమాన్ మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో దాన్ని అందుకోవడం కోసం పెద్ద కసరత్తే చేయాలి. క్యాస్టింగ్ కుదరగానే షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోవాలి. తన సినిమాటిక్ యునివర్స్ కోసం ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ ఇకపై దాని ద్వారానే ఆసక్తికరమైన అప్డేట్స్ పంచుకుంటానని చెప్పేశాడు. 

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago