గత వారం పదిరోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ దాకా అన్ని మీడియాల్లోనూ బాగా హైలైట్ అయిన వార్త రణ్వీర్ సింగ్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ ప్యాన్ ఇండియా మూవీ రాక్షస్. ఉందని ఒకసారి ఉందని, లేదు క్యాన్సిల్ చేశారని మరోసారి ఇలా ఏవేవో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అభిమానులు ఏవి నిజమో ఏవి అబద్దమో తెలియని అయోమయంలో పడ్డారు. దానికి తోడు యూనిట్ నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని క్లారిఫికేషన్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు మరింత కన్ఫ్యూజన్ పెంచాయి. ఎట్టకేలకు అన్నింటికి చెక్ పెడుతూ టీమ్ తరఫున అఫీషియల్ నోట్ వచ్చింది.
అనుకున్నట్టే రాక్షస్ కొనసాగడం లేదు. హీరో, దర్శకుడు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి వచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా ఇకపై ఇది నిర్మాణంలోకి వెళ్లడం లేదు. రణ్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన వాడిగా పేర్కొంటూ, కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా సాధ్యపడలేదని, భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన స్టేట్ మెంట్ లో రణ్వీర్ ఎనర్జీ, టాలెంట్ అరుదుగా దొరికే రకమని, త్వరలో తమ కలయిక సాధ్యం కావడం కోసం ఎదురు చూస్తుంటానని ఉంది. మైత్రి తరఫున టైం వచ్చినప్పుడు అన్నీ కుదురుతాయని ముగింపు పలికింది.
మొత్తానికి హనుమాన్ తర్వాత భారీ బాలీవుడ్ డెబ్యూ అందుకోబోతున్న తరుణంలో ప్రశాంత్ వర్మకు ఇది ట్విస్టే కానీ అంత ఫీలవ్వాల్సిన పని కూడా లేదనే చెప్పాలి. ఏ షారుఖ్ ఖానో అయితే అయ్యో అనుకోవచ్చు కానీ రణ్వీర్ సింగే కాబట్టి తీవ్రంగా కోల్పోయిందేమి లేదు. జై హనుమాన్ మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో దాన్ని అందుకోవడం కోసం పెద్ద కసరత్తే చేయాలి. క్యాస్టింగ్ కుదరగానే షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోవాలి. తన సినిమాటిక్ యునివర్స్ కోసం ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ ఇకపై దాని ద్వారానే ఆసక్తికరమైన అప్డేట్స్ పంచుకుంటానని చెప్పేశాడు.
This post was last modified on May 30, 2024 2:22 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…