Movie News

బాలయ్య మీద వివాదాలు: హీరో నిర్మాత క్లారిటీ

మొన్న జరిగిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండు విషయాలు సోషల్ మీడియాలో బాగా హైలైటయ్యాయి. ఒకటి బాలకృష్ణ కూర్చున్న కుర్చీ కింద నీళ్ల బాటిల్ తో పాటు మందు సీసా ఉన్నట్టు వచ్చిన వీడియో. రెండోది వేడుక చివర్లో స్టేజి మీద హీరోయిన్ అంజలిని బాలయ్య చిన్నగా తోసిన సంఘటన మరొకటి. వీటి ముందు వెనుక ఏం జరిగిందనేది చూసుకోకుండా కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే ప్రచారంకి తేవడంతో ఇది కాస్తా దూరం వెళ్లిపోయింది. ఇతర బాషల కొన్ని మీడియా హ్యాండిల్స్ సైతం చెక్ చేసుకోకుండా వాటిని పోస్ట్ చేయడంతో పెద్ద చర్చ జరిగింది.

ఈ వివాదాల గురించి విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వీడియోలో చూపించిన మందు సీసా కేవలం సిజిలో ఎవరో దురుద్దేశంతో సృష్టించిందని, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న తమకు ఉన్నది లేనిది స్పష్టంగా తెలుసని కుండ బద్దలు కొట్టారు. తమ సినిమా రెండో భాగం సిజికి వీళ్ళే పని చేయబోతున్నారని విశ్వక్ చురక వేశాడు. అంజలిని పక్కకు తోసేయడం జరగలేదని, అంత శబ్దంలో జరగమని చెబితే ఆమెకు వినిపించలేదని, చనువుతో పక్కకు జరిపారు తప్పించి వేరే ఏ ఉద్దేశం లేదని అన్నారు. తర్వాత ఇద్దరు హై ఫై అంటూ చేతులతో చప్పట్లు  చరచడం చూపించలేదన్నారు.

ఇదంతా అభిమానులకు సంతోషం కలిగించే వ్యవహారమే అయినా నిన్న ఆ వీడియోలు చేసిన రచ్చ మాత్రం మామూలుది కాదు. ఇక సెన్సార్ గురించి మాట్లాడుతూ కేవలం మూడు చోట్ల మాత్రమే అభ్యంతరం అనిపించే పదాలు ఉంటాయని అవి కూడా డొమెస్టిక్ కాపీలో ఇబ్బందికరంగా ఉండవని విశ్వక్ సేన్ అన్నాడు. ముందు యూత్ మాత్రమే టార్గెట్ అవుతారు అనుకుంటే నిన్న ఫైనల్ కాపీ చూశాక చిన్న పిల్లలు సైతం వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటుందని, అలా అనిపించకపోతే తర్వాత ఇదే ప్రెస్ మీట్లలో నన్ను నిలదీయొచ్చని విశ్వక్ సేన్ చెప్పడం విశేషం. ఇంకొద్ది గంటల్లో షోలు పడబోతున్నాయి. 

This post was last modified on May 30, 2024 2:23 pm

Share
Show comments

Recent Posts

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

23 minutes ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

44 minutes ago

విశాఖపట్నంలో వండర్‌లా.. తిరుపతిలో ఇమాజికా వరల్డ్!

ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక…

1 hour ago

ఉండి టాక్: రఘురామ సత్తా తెలుస్తోందా..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం…

1 hour ago

బోయపాటి సిలబస్ మారే టైమొచ్చింది

ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…

1 hour ago

అభిమానం హద్దు మీరితే చాలా ప్రమాదం

నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…

2 hours ago