Movie News

మెగా హీరో.. అది క్యాన్సిల్, ఇది ఫిక్స్

మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై దాన్నుంచి కోలుకున్నాక రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్‌బస్టర్ అయింది. మరో చిత్రం ‘బ్రో’ ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమా రిలీజయ్యాక తేజు.. కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. తనకు ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొంత టైం కావాలని అతను చెప్పాడు.

ఐతే చెప్పిన దాని కంటే తేజు ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఈపాటికే అతను సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ మొదలుపెట్టాల్సింది. కానీ బడ్జెట్, ఇతర సమస్యల కారణంగా అది హోల్డ్‌లో పడిపోయింది. సంపత్ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించే విషయంలో ఆశాభావంతోనే కనిపించాడు. కానీ అది కోరిక తీరట్లేదని తెలుస్తోంది. ‘గాంజా శంకర్’ దాదాపుగా ఆగిపోయినట్లే భావిస్తున్నారు.

ఎందుకంటే తేజు ‘గాంజా శంకర్’ ఊసెత్తకుండా కొత్త సినిమాను ప్రకటించాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి బేనర్లో తేజు కొత్త సినిమా తెరకెక్కబోతోంది. రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజే ఈ చిత్రాన్ని ప్రకటించాల్సింది. సాయంత్రం 4.05 గంటలకు ముహూర్తం కూడా నిర్ణయించారు. కానీ ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా ఈ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదని ప్రైమ్ షో సంస్థ ఈ రోజు ట్విట్టర్లో ప్రకటించింది. త్వరలోనే ప్రకటన రాబోెతున్నట్లు వెల్లడించారు.

ఐతే అనౌన్స్‌మెంట్ ఆలస్యం కావచ్చు కానీ.. తేజు తర్వాత చేయబోయే సినిమా మాత్రం ఇదే. తేజు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని.. ఇది తేజు ఇంత వరకు చేయని జానర్లో తెరకెక్కే సినిమా అని అంటున్నారు. మరి ‘గాంజా శంకర్’ సంగతేంటో చూడాలి.

This post was last modified on May 29, 2024 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

22 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

58 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago