Movie News

మెగా హీరో.. అది క్యాన్సిల్, ఇది ఫిక్స్

మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై దాన్నుంచి కోలుకున్నాక రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్‌బస్టర్ అయింది. మరో చిత్రం ‘బ్రో’ ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమా రిలీజయ్యాక తేజు.. కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. తనకు ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొంత టైం కావాలని అతను చెప్పాడు.

ఐతే చెప్పిన దాని కంటే తేజు ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఈపాటికే అతను సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ మొదలుపెట్టాల్సింది. కానీ బడ్జెట్, ఇతర సమస్యల కారణంగా అది హోల్డ్‌లో పడిపోయింది. సంపత్ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించే విషయంలో ఆశాభావంతోనే కనిపించాడు. కానీ అది కోరిక తీరట్లేదని తెలుస్తోంది. ‘గాంజా శంకర్’ దాదాపుగా ఆగిపోయినట్లే భావిస్తున్నారు.

ఎందుకంటే తేజు ‘గాంజా శంకర్’ ఊసెత్తకుండా కొత్త సినిమాను ప్రకటించాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి బేనర్లో తేజు కొత్త సినిమా తెరకెక్కబోతోంది. రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజే ఈ చిత్రాన్ని ప్రకటించాల్సింది. సాయంత్రం 4.05 గంటలకు ముహూర్తం కూడా నిర్ణయించారు. కానీ ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా ఈ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదని ప్రైమ్ షో సంస్థ ఈ రోజు ట్విట్టర్లో ప్రకటించింది. త్వరలోనే ప్రకటన రాబోెతున్నట్లు వెల్లడించారు.

ఐతే అనౌన్స్‌మెంట్ ఆలస్యం కావచ్చు కానీ.. తేజు తర్వాత చేయబోయే సినిమా మాత్రం ఇదే. తేజు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని.. ఇది తేజు ఇంత వరకు చేయని జానర్లో తెరకెక్కే సినిమా అని అంటున్నారు. మరి ‘గాంజా శంకర్’ సంగతేంటో చూడాలి.

This post was last modified on May 29, 2024 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago