ఒక పెద్ద సినిమా థియేటర్లో ఆడినా ఆడకపోయినా దాన్నుంచి నిర్మాత రాబట్టుకునే ఓటిటి రెవిన్యూ అతని పెట్టుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వీటి ఒప్పందాలు ఆషామాషీగా ఉండవు. నిబంధనలు కఠినంగా ఉంటాయి. వాటిని మీరినా, పాటించకపోయినా అంతే సంగతులు. ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఎంత స్ట్రిక్టో అర్థం కావాలంటే రెండు ఉదాహరణలు చూడాలి. మొదటిది లాల్ సలామ్. సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో లాంటి ప్రధాన పాత్ర పోషించిన ఈ అల్ట్రా డిజాస్టర్ ఇప్పటిదాకా డిజిటల్ వెలుగు చూడలేదు. టాక్ విని దూరంగా ఉన్న అభిమానులు స్మార్ట్ స్క్రీన్ కోసం వెయిట్ చేశారు.
తీరాచూస్తే ఎదురు చూసే కొద్దీ నెలలు గడుస్తున్నా లాల్ సలామ్ ఓటిటిలో రాలేదు. కారణం ఏంటయ్యా అంటే సినిమాలో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ కు సంబంధించిన క్రికెట్ ఫుటేజ్ దొరక్కపోవడం వల్లేనని ఇన్ సైడ్ టాక్. దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ హార్డ్ డిస్క్ పోయిందని చెప్పడం ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. రెండోది గణపథ్. టైగర్ శ్రోఫ్, కృతి సనన్ జోడిగా అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ ఆల్ టైం ఫ్లాప్ ని నెట్ ఫ్లిక్సే కొంది. గత ఏడాది అక్టోబర్ లో రిలీజైతే ఇప్పటిదాకా ఓటిటి జాడ లేదు. ఇటీవలే ఒక శాటిలైట్ ఛానల్ లో వరల్డ్ ప్రీమియర్ వేశారు.
దీనికి కారణం కూడా నెట్ ఫ్లిక్స్ పెట్టిన టర్మ్స్ ని సదరు ప్రొడ్యూసర్లు పాటించకపోవడం వల్లేనని డిజిటల్ వర్గాల కథనం. ఇలా జరగడం వల్ల వేల కోట్లతో వ్యాపారం చేసే ఓటిటి సంస్థలకు పెద్ద డ్యామేజ్ ఉండదు కానీ ఆదాయం కోల్పోయేది మాత్రం ఖచ్చితంగా నిర్మాతే. దీనికి తోడు థియేటర్లో మిస్ చేసుకున్న మూవీ లవర్స్ కి చూసే అవకాశం దక్కదు. ఇలాంటి కారణంతో అఖిల్ ఏజెంట్ కూడా ఇప్పటిదాకా బయటికి రానేలేదు. ఆర్థిక పరమైన లీగల్ లావాదేవీలు కారణంగా చెబుతున్నారు కానీ ఎప్పటికి మోక్షం దక్కుతుందో తెలియదు. హక్కులు కొన్న సోని లివ్ మాత్రం అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది.
This post was last modified on May 29, 2024 1:03 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…