శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించాలనేది నాగ చైతన్య డ్రీమ్స్ లో ఒకటి. ‘లవ్స్టోరీ’తో చైతన్య ఆ కల సాకారం చేసుకున్నాడు. కమ్ముల కూడా తన స్టయిల్ మార్చి ఈసారి తన హీరోను ఎన్నారైలా కాకుండా మాస్ కుర్రాడిగా చూపిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ అవడంతో క్రేజ్ కూడా బాగానే వుంది. కరోనా బ్రేక్ రాకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదలయి వుండేది. ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ మొదలయింది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీలో వున్నాయి.
ఆకర్షణీయమయిన ఆఫర్స్ వస్తూ వుండడంతో ఓటిటి రిలీజ్ కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. కానీ నాగ చైతన్య మాత్రం ఓటిటి రిలీజ్ పట్ల సుముఖంగా లేడట. శేఖర్ కమ్ముల సినిమా క్లిక్ అయితే ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో, తన మార్కెట్ని ఎంతగా ఎలివేట్ చేస్తుందో నాగచైతన్యకు తెలుసు. ఇప్పటికే మిడ్ రేంజ్ హీరోల్లో నాగ చైతన్యకు సాలిడ్ మార్కెట్ వుంది. శేఖర్ కమ్ముల సినిమా హిట్టయితే ఇక ఆ శ్రేణి హీరోలలో తనకు తిరుగుండదు. అదే ఓటిటిలో రిలీజ్ అయితే ఇంత గొప్ప ఛాన్స్ ఎటూ కాకుండా అయిపోతుంది.
శేఖర్ కమ్ములను ఓటిటి రిలీజ్ గురించి అడిగితే, నాగ చైతన్య నిర్ణయం తెలుసుకోమన్నాడట. అయినా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ గురించి కంగారు పడాల్సిన అవసరమేంటని, థియేటర్లు ఎలాగో త్వరలో తెరిచేస్తారు కనుక బిజినెస్ గురించిన చింత అక్కర్లేదని నాగ చైతన్య అభిప్రాయమట.
This post was last modified on September 19, 2020 6:16 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…