హనుమాన్ మూవీతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ఉత్తరాదిన కూడా చాలా బాగా ఆడింది. దీంతో బాలీవుడ్ నటులు, నిర్మాతల కళ్లు కూడా ప్రశాంత్ మీద పడ్డాయి. ఈ క్రమంలోనే అతడితో సినిమా చేయడానికి రణ్వీర్ సింగ్ ముందుకు వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్లో సినిమాకు సన్నాహాలు చేసింది. ‘బ్రహ్మ రాక్షస’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్లో మైత్రీ వాళ్లు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఐతే ఇటీవల ఈ సినిమా కోసం ఒక రిహార్సల్ షూట్ లాంటిది చేశారని.. దానికి భారీగా ఖర్చయిందని.. ఐతే ఔట్పుట్తో పాటు ప్రశాంత్ పనితీరు నచ్చక రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని.. దీంతో మైత్రీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని జోరుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐతే ఈ వార్తల మీద పూర్తి వివరణ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు ఉంటుందని మాత్రం మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఆ రూమర్ల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. రణ్వీర్ సింగ్తో తన సినిమా పక్కాగా ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి నిరాధారమైన వార్తలు రాశారని.. ఈ గాసిప్స్ ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని ప్రశాంత్ తెలిపాడు.
రణ్వీర్తో తాము చేసింది జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే అని.. అది కూడా సంతృప్తికరంగానే వచ్చిందని.. నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను వచ్చే ఏడాదే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాంతో పాటుగా ప్రశాంత్ ‘బ్రహ్మ రాక్షస’నూ సమాంతరంగా తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on May 28, 2024 1:47 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…