Movie News

ఆ వార్తలు ఎవరు పుట్టించారో-ప్రశాంత్ వర్మ

హనుమాన్ మూవీతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ఉత్తరాదిన కూడా చాలా బాగా ఆడింది. దీంతో బాలీవుడ్ నటులు, నిర్మాతల కళ్లు కూడా ప్రశాంత్ మీద పడ్డాయి. ఈ క్రమంలోనే అతడితో సినిమా చేయడానికి రణ్వీర్ సింగ్ ముందుకు వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్లో సినిమాకు సన్నాహాలు చేసింది. ‘బ్రహ్మ రాక్షస’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్లో మైత్రీ వాళ్లు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఐతే ఇటీవల ఈ సినిమా కోసం ఒక రిహార్సల్ షూట్ లాంటిది చేశారని.. దానికి భారీగా ఖర్చయిందని.. ఐతే ఔట్‌పుట్‌తో పాటు ప్రశాంత్ పనితీరు నచ్చక రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని.. దీంతో మైత్రీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని జోరుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐతే ఈ వార్తల మీద పూర్తి వివరణ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు ఉంటుందని మాత్రం మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఆ రూమర్ల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. రణ్వీర్ సింగ్‌తో తన సినిమా పక్కాగా ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి నిరాధారమైన వార్తలు రాశారని.. ఈ గాసిప్స్ ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని ప్రశాంత్ తెలిపాడు.

రణ్వీర్‌తో తాము చేసింది జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే అని.. అది కూడా సంతృప్తికరంగానే వచ్చిందని.. నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను వచ్చే ఏడాదే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాంతో పాటుగా ప్రశాంత్ ‘బ్రహ్మ రాక్షస’నూ సమాంతరంగా తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on May 28, 2024 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

31 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago