Movie News

ఆ వార్తలు ఎవరు పుట్టించారో-ప్రశాంత్ వర్మ

హనుమాన్ మూవీతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ఉత్తరాదిన కూడా చాలా బాగా ఆడింది. దీంతో బాలీవుడ్ నటులు, నిర్మాతల కళ్లు కూడా ప్రశాంత్ మీద పడ్డాయి. ఈ క్రమంలోనే అతడితో సినిమా చేయడానికి రణ్వీర్ సింగ్ ముందుకు వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్లో సినిమాకు సన్నాహాలు చేసింది. ‘బ్రహ్మ రాక్షస’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్లో మైత్రీ వాళ్లు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఐతే ఇటీవల ఈ సినిమా కోసం ఒక రిహార్సల్ షూట్ లాంటిది చేశారని.. దానికి భారీగా ఖర్చయిందని.. ఐతే ఔట్‌పుట్‌తో పాటు ప్రశాంత్ పనితీరు నచ్చక రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని.. దీంతో మైత్రీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని జోరుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐతే ఈ వార్తల మీద పూర్తి వివరణ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు ఉంటుందని మాత్రం మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఆ రూమర్ల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. రణ్వీర్ సింగ్‌తో తన సినిమా పక్కాగా ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి నిరాధారమైన వార్తలు రాశారని.. ఈ గాసిప్స్ ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని ప్రశాంత్ తెలిపాడు.

రణ్వీర్‌తో తాము చేసింది జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే అని.. అది కూడా సంతృప్తికరంగానే వచ్చిందని.. నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను వచ్చే ఏడాదే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాంతో పాటుగా ప్రశాంత్ ‘బ్రహ్మ రాక్షస’నూ సమాంతరంగా తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on May 28, 2024 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

45 minutes ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

3 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

5 hours ago

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

5 hours ago

నా ఉద్దేశం అది కాదంటున్న అనన్య

చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ్‌లోకి మార్చి, వాటి ద్వారా హాట్…

6 hours ago

మళ్ళీ వస్తామంటున్న ‘యువ’ జంట

టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…

6 hours ago