ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘కల్కి’ విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజుల సమయమే ఉంది. షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ప్రమోషన్లు మొదలుపెట్టేసింది చిత్ర బృందం. ఇ
టీవలే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అని చెప్పుకోదగ్గ బుజ్జి అనే విచిత్ర వాహనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేసింది చిత్ర బృందం. అందులో ప్రభాసే కీలకంగా వ్యవహరించాడు. కానీ ముఖ్య నటీనటుల్లో ఇంకెవరూ కనిపించలేదు.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి నటుల స్థాయి వేరు. వాళ్లవి లీడ్ రోల్స్ కూడా కావు. కాబట్టి వాళ్లు ప్రమోషన్లలో పాల్గొనకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ కథానాయికగా నటిస్తున్న దీపికా పదుకొనే మాత్రం ఈ ఈవెంట్లో పాల్గొనలేదు. అంతే కాక ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా ఆమె నుంచి సౌండే లేదు.
సోషల్ మీడియాలో సైతం ‘కల్కి’ సినిమాను ఆమె ప్రమోట్ చేయట్లేదు. ఈ సినిమా మొదలైనపుడు మీడియా వాళ్లు దీన్ని ప్రభాస్ చిత్రంగా పేర్కొనడం, తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టడం గుర్తుండే ఉంటుంది.
కట్ చేస్తే ఇప్పుడు కథానాయికగా సినిమాను ఓన్ చేసుకుని ప్రమోషన్లలో పాల్గొనాల్సిన దీపిక.. ఇటు వైపు చూడట్లేదు. తను నటించే హిందీ సినిమాలను మాత్రం ముందు నుంచి బాగా ప్రమోట్ చేస్తుంది దీపికా. కానీ ఎంతో పెద్ద స్కేల్లో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమాను మాత్రం విస్మరిస్తున్న భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది.
కనీసం రిలీజ్ టైంకి అయినా ఆమె మీడియా ముందుకు వస్తుందా.. ఇంటర్వ్యూలు ఇస్తుందా అన్నది సందేహంగా ఉంది. పోనీ ప్రి రిలీజ్ ఈవెంట్కు అయినా హాజరైతే అదే చాలు అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
This post was last modified on May 24, 2024 10:24 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…