ఓటీటీల్లో కొత్త సినిమాలు నేరుగా రిలీజయ్యే సంస్కృతి మొదలయ్యాక విపరీతమైన చర్చ జరిగిన సినిమాల్లో ‘నిశ్శబ్దం’ ఒకటి. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఈ చిత్రాన్ని నేరుగా డిజిటిల్ స్ట్రీమింగ్లోకి తెచ్చేస్తారని ఐదారు నెలలుగా చర్చ నడుస్తోంది. కానీ ఎంతకీ విషయం తేలలేదు. ఎట్టకేలకు ఈ మధ్యే చిత్ర బృందం ఓటీటీ రిలీజ్కు రెడీ అయిపోయింది. అమేజాన్ ప్రైమ్తో డీల్ కూడా ఓకే అయింది.
ఆ తర్వాత కూడా కొన్ని రోజులు నాన్చిన చిత్ర బృందం ఎట్టకేలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే అక్టోబరు 2న ‘నిశ్శబ్దం’ ప్రైమ్లో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రైమ్ వాళ్లు ప్రోమోలు కూడా వదిలేశారు.
‘నిశ్శబ్దం’ సినిమాకు మూడేళ్ల కిందట సన్నాహాలు మొదలయ్యాయి. ఏడాదికి పైగా మేకింగ్ దశలో ఉందా చిత్రం. ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ సినిమా తీసిన హేమంత్ మధుకర్ దీనికి దర్శకుడు. కోన వెంకట్తో పాటు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయిగా నటించడం విశేషం.
మాధవన్ ఓ విభిన్నమైన పాత్రలో నటించాడు. హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఓ కీలక పాత్ర పోషించాడు. అమెరికా నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. దీని టీజర్ ఉత్కంఠభరితంగా ఉండి హాలీవుడ్ సినిమాలను తలపించింది. మాటలు రాని, వినిపించని ఓ అమ్మాయి ఓ హత్య తాలూకు గుట్టును ఎలా ఛేదించిందన్నది ఈ కథ. తెలుగులో తొలిసారి ఓటీటీల్లో రిలీజైన పెద్ద సినిమా ‘వి’ తేలిపోయిన నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ మీద చాలా ఆశలతో ఉంది టాలీవుడ్. మరి అనుష్క సినిమా అంచనాల్ని ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on September 18, 2020 4:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…