Movie News

ధృవ 2 కొత్త విలన్ దొరికాడు

అదేంటి రామ్ చరణ్ ఎక్కడా చెప్పనిది ధృవ 2 ఎక్కడ నుంచి ఊడిపడ్డాడని ఆశ్చర్యపోకండి. ధృవ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో గాడ్ ఫాదర్ చేసిన మోహన రాజా దీనికి దర్శకుడు. తమిళంలో బాక్సాఫీస్ ఫలితం చూశాక తెలుగు రీమేక్ గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అప్పటిదాకా ఖరారుగా చెప్పలేం. సెకండ్ పార్ట్ లోనూ జయం రవినే హీరో. మొదటి భాగం రెండు భాషల్లో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు. అయితే ఆ పాత్ర చివర్లో చనిపోవడంతో ఇప్పుడు కొనసాగింపులోకి తీసుకోవడం సాధ్యపడదు.

అందుకే మోహన్ రాజా కొత్త విలన్ కోసం చేసిన వేట కొలిక్కి వచ్చినట్టు సమాచారం. బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్ ఈ పాత్ర చేయడానికి స్పందించినట్టు తెలిసింది. ఇటీవలే చెన్నైలో ఫోటో షూట్ చేసి లుక్స్ సంతృప్తికరంగా రావడంతో ఓకే అనుకున్నట్టు తెలిసింది. అభిషేక్ కు కథ విపరీతంగా నచ్చేసిందని అంటున్నారు. తండ్రి అమితాబ్ బచ్చన్ సౌత్ లో సైరా, కల్కి 2898 ఏడి లాంటి భారీ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టైంలో అభిషేక్ కనక ధృవ 2 లాంటి యాక్షన్ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇస్తే సౌత్ దర్శకులకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ప్రతినాయకుడు దొరికినట్టే.

ఇక మన విషయానికి వస్తే ధృవ 2 కావాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తని ఒరువన్ 2 కనక హిట్ అయితే తెలుగులోనూ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అప్పుడంటే డేట్ల సమస్య వల్ల ఆ ఛాన్స్ సురేందర్ రెడ్డికి దక్కింది కానీ ఈసారి మాత్రం రామ్ చరణ్ ఒప్పుకుంటే మోహన్ రాజానే ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇప్పుడీ సీక్వెల్ కి కూడా హిప్ హాప్ తమిజానే సంగీతం సమకూరుస్తున్నాడు. వీలైతే ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాలో నయనతారనే హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నట్టు తెలిసింది.

This post was last modified on May 24, 2024 12:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

2 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

7 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

9 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

14 hours ago