Movie News

నేను టీ అమ్ముకుంటున్నట్లు రాశారు-లయ

తెలుగు సినిమాలపై బలమైన ముద్ర వేసిన తెలుగు హీరోయిన్లలో లయ ఒకరు. ‘స్వయంవరం’ లాంటి సూపర్ హిట్ మూవీతో కథానాయికగా పరిచయమైన లయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో పక్కనా కథానాయికగా చేసింది. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. 2007లో ఒక ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. తర్వాత చాలా ఏళ్లు లయ కనిపించలేదు.

మధ్యలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి మాయమైన లయ.. ఇప్పుడు నితిన్ మూవీ ‘తమ్ముడు’తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. పెళ్లి తర్వాత జీవితం, సినిమాల్లోకి పునరాగమనం చేయడం గురించి మాట్లాడింది. తాను అమెరికాలో ఉన్న టైంలో తన గురించి ఇక్కడి మీడియాలో దుష్ప్రచారాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

“నేను పెళ్లి చేసుకుని 2007లో అమెరికాకు వెళ్లిపోయాను. కుటుంబం, పిల్లల కోసం సమయం కేటాయించాలని సినిమాలకు దూరం అయ్యాను. పిల్లలు పెరిగే సమయంలో వారితోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఐతే నేను మీడియాకు దూరంగా ఉన్న టైంలో ఏదేదో రాశారు. మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వచ్చే వార్తలను జనం నమ్మరు. కానీ సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని, నేను టీ అమ్ముకుని బతుకుతున్నానని.. ఇలా దారుణంగా రాశారు. అది చూసి మా కుటుంబం బాధ పడింది. నేను కూడా ఆ వార్తలు చూసి బాధ పడ్డాను. అవేవీ నిజాలు కావు. ఇప్పుడు మా పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకునే స్థితిలో ఉన్నారు. అందుకే మళ్లీ ‘తమ్ముడు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాను. ఈ సినిమా షూట్ కోసం ఇక్కడే ఉంటున్నా” అని లయ వివరించింది.

This post was last modified on May 23, 2024 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

9 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

10 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

10 hours ago