Movie News

నేను టీ అమ్ముకుంటున్నట్లు రాశారు-లయ

తెలుగు సినిమాలపై బలమైన ముద్ర వేసిన తెలుగు హీరోయిన్లలో లయ ఒకరు. ‘స్వయంవరం’ లాంటి సూపర్ హిట్ మూవీతో కథానాయికగా పరిచయమైన లయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో పక్కనా కథానాయికగా చేసింది. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. 2007లో ఒక ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. తర్వాత చాలా ఏళ్లు లయ కనిపించలేదు.

మధ్యలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి మాయమైన లయ.. ఇప్పుడు నితిన్ మూవీ ‘తమ్ముడు’తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. పెళ్లి తర్వాత జీవితం, సినిమాల్లోకి పునరాగమనం చేయడం గురించి మాట్లాడింది. తాను అమెరికాలో ఉన్న టైంలో తన గురించి ఇక్కడి మీడియాలో దుష్ప్రచారాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

“నేను పెళ్లి చేసుకుని 2007లో అమెరికాకు వెళ్లిపోయాను. కుటుంబం, పిల్లల కోసం సమయం కేటాయించాలని సినిమాలకు దూరం అయ్యాను. పిల్లలు పెరిగే సమయంలో వారితోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఐతే నేను మీడియాకు దూరంగా ఉన్న టైంలో ఏదేదో రాశారు. మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వచ్చే వార్తలను జనం నమ్మరు. కానీ సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని, నేను టీ అమ్ముకుని బతుకుతున్నానని.. ఇలా దారుణంగా రాశారు. అది చూసి మా కుటుంబం బాధ పడింది. నేను కూడా ఆ వార్తలు చూసి బాధ పడ్డాను. అవేవీ నిజాలు కావు. ఇప్పుడు మా పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకునే స్థితిలో ఉన్నారు. అందుకే మళ్లీ ‘తమ్ముడు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాను. ఈ సినిమా షూట్ కోసం ఇక్కడే ఉంటున్నా” అని లయ వివరించింది.

This post was last modified on May 23, 2024 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

2 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

2 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

2 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

3 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

3 hours ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

4 hours ago