Movie News

నేను టీ అమ్ముకుంటున్నట్లు రాశారు-లయ

తెలుగు సినిమాలపై బలమైన ముద్ర వేసిన తెలుగు హీరోయిన్లలో లయ ఒకరు. ‘స్వయంవరం’ లాంటి సూపర్ హిట్ మూవీతో కథానాయికగా పరిచయమైన లయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో పక్కనా కథానాయికగా చేసింది. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. 2007లో ఒక ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. తర్వాత చాలా ఏళ్లు లయ కనిపించలేదు.

మధ్యలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి మాయమైన లయ.. ఇప్పుడు నితిన్ మూవీ ‘తమ్ముడు’తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. పెళ్లి తర్వాత జీవితం, సినిమాల్లోకి పునరాగమనం చేయడం గురించి మాట్లాడింది. తాను అమెరికాలో ఉన్న టైంలో తన గురించి ఇక్కడి మీడియాలో దుష్ప్రచారాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

“నేను పెళ్లి చేసుకుని 2007లో అమెరికాకు వెళ్లిపోయాను. కుటుంబం, పిల్లల కోసం సమయం కేటాయించాలని సినిమాలకు దూరం అయ్యాను. పిల్లలు పెరిగే సమయంలో వారితోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఐతే నేను మీడియాకు దూరంగా ఉన్న టైంలో ఏదేదో రాశారు. మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వచ్చే వార్తలను జనం నమ్మరు. కానీ సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని, నేను టీ అమ్ముకుని బతుకుతున్నానని.. ఇలా దారుణంగా రాశారు. అది చూసి మా కుటుంబం బాధ పడింది. నేను కూడా ఆ వార్తలు చూసి బాధ పడ్డాను. అవేవీ నిజాలు కావు. ఇప్పుడు మా పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకునే స్థితిలో ఉన్నారు. అందుకే మళ్లీ ‘తమ్ముడు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాను. ఈ సినిమా షూట్ కోసం ఇక్కడే ఉంటున్నా” అని లయ వివరించింది.

This post was last modified on May 23, 2024 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

22 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago