మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
లెజెండరీ నటి జీవితాన్ని నాగ అశ్విన్ ఎంత గొప్పగా తెరకెక్కించాడో అంతకన్నా మిన్నగా ప్రాణం పోసిన కీర్తి సురేష్ కు అవార్డుల కన్నా ఎక్కువగా ప్రేక్షక లోకం నుంచి ప్రశంసలు దక్కాయి.
తిరిగి ఇంత గ్యాప్ తర్వాత మరో లెజెండరి బయోపిక్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ఎవరిదో కాదు. సుప్రసిద్ధ గాయని, వెంకటేశ్వర సుప్రభాతంతో ప్రతి ఇంటా కొలువుతీరిన ఎంఎస్ సుబ్బులక్ష్మిది.
ప్రస్తుతం ఆవిడ జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ, దర్శకుడు తదితర వివరాలు ఇంకా తెలియనప్పటికీ టైటిల్ రోల్ కీర్తి సురేష్ పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
సుబ్బులక్ష్మి జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి. మదురైలో ఒక మాములు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరులో చాలా మలుపులున్నాయి.
1997లో భర్త చనిపోయాక పాడటం ఆపేసిన ఈ అజరామర గాయని 2004లో కన్ను మూశారు. భక్తి పాటలతో ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేసే అనిర్వచనీయ మహత్తు ఆవిడ గాత్రంలో ఉండేది.
ఒకవేళ కీర్తి సురేష్ తో సాధ్యపడకపోతే నయనతార, త్రిష పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ప్రస్తుతానికి ఇంతకు మించిన వివరాలు లేవు. ఎంతసేపూ క్రికెటర్లు, రాజకీయ నాయకుల కథలనే తీస్తున్న మేకర్స్ ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీలను తెరకు పరిచయం చేయడం ద్వారా ఇప్పటి తరానికి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిన వారవుతారు.
పేరుకి సుబ్బులక్ష్మి తమిళనాడుకి చెందిన వారే అయినా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ఆవిడకు లక్షల్లో అభిమానులు ఉండేవారు. ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. అలాంటి మహనీయురాలి గాథను తెరపై చూడటం అవసరమే.
This post was last modified on May 21, 2024 9:27 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…