ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ షూటింగ్ కి వెళ్లడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. దీన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలో దింపాలనేది నిర్మాత దిల్ రాజు ఆలోచన. ముందు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనుకున్నారు కానీ హీరో, డైరెక్టరే సరిగా లాక్ కాపోవడంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు. రానా నాయుడు సీజన్ 2 కోసం ఎక్కువ రోజులు ముంబైలో గడపాల్సి వచ్చిన వెంకీ తరచు హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. అయితే దానికి పెంచిన గెటప్ అనిల్ కథకు సూటవ్వదు కాబట్టి ఎదురు చూస్తున్నారు.
తాజాగా వచ్చిన ఆసక్తికర అప్డేట్ ఇందులో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలిసింది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి శుభాంక్షలు చెబితే దానికి బదులుగా మనోజ్ రీ ట్వీట్ చేస్తూ త్వరలో మన కాంబినేషన్ తో దుమ్ము దులుపుదాం అంటూ బదులిచ్చాడు. హీరో డైరెక్టర్ గా అయితే ఈ కలయిక ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది వెంకీ మూవీలో క్యారెక్టర్ గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో మాజీ ప్రియురాలు, భార్య మధ్య జరిగే ఒక థ్రిల్లర్ టైపు యాక్షన్ డ్రామాగా అనిల్ దీన్ని వెరైటీగా రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.
బహుశా జూలై లేదా ఆగస్ట్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. లొకేషన్లతో సహా రావిపూడి ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలిసింది. వేగంగా షూటింగ్ చేసేలా ప్రణాళిక ఉందట. గతంలో సరిలేరు నీకెవ్వరుని కేవలం ఆరు నెలల్లో ఫినిష్ చేసిన ట్రాక్ రికార్డు అనిల్ రావిపూడిది. మహేష్ బాబునే అంత ఫాస్ట్ గా డీల్ చేసినప్పుడు వెంకీతో ఎంత సౌకర్యంగా ఉంటుందో వేరే చెప్పాలా. కాకపోతే ఆలస్యమవుతూ ఉండటంతో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. దీనికన్నా ముందు అనుదీప్ తో ఒక సినిమా చేయాల్సింది కానీ స్టోరీ కుదరక అది కాస్తా రవితేజకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 21, 2024 2:58 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…