ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ షూటింగ్ కి వెళ్లడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. దీన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలో దింపాలనేది నిర్మాత దిల్ రాజు ఆలోచన. ముందు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనుకున్నారు కానీ హీరో, డైరెక్టరే సరిగా లాక్ కాపోవడంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు. రానా నాయుడు సీజన్ 2 కోసం ఎక్కువ రోజులు ముంబైలో గడపాల్సి వచ్చిన వెంకీ తరచు హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. అయితే దానికి పెంచిన గెటప్ అనిల్ కథకు సూటవ్వదు కాబట్టి ఎదురు చూస్తున్నారు.
తాజాగా వచ్చిన ఆసక్తికర అప్డేట్ ఇందులో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలిసింది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి శుభాంక్షలు చెబితే దానికి బదులుగా మనోజ్ రీ ట్వీట్ చేస్తూ త్వరలో మన కాంబినేషన్ తో దుమ్ము దులుపుదాం అంటూ బదులిచ్చాడు. హీరో డైరెక్టర్ గా అయితే ఈ కలయిక ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది వెంకీ మూవీలో క్యారెక్టర్ గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో మాజీ ప్రియురాలు, భార్య మధ్య జరిగే ఒక థ్రిల్లర్ టైపు యాక్షన్ డ్రామాగా అనిల్ దీన్ని వెరైటీగా రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.
బహుశా జూలై లేదా ఆగస్ట్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. లొకేషన్లతో సహా రావిపూడి ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలిసింది. వేగంగా షూటింగ్ చేసేలా ప్రణాళిక ఉందట. గతంలో సరిలేరు నీకెవ్వరుని కేవలం ఆరు నెలల్లో ఫినిష్ చేసిన ట్రాక్ రికార్డు అనిల్ రావిపూడిది. మహేష్ బాబునే అంత ఫాస్ట్ గా డీల్ చేసినప్పుడు వెంకీతో ఎంత సౌకర్యంగా ఉంటుందో వేరే చెప్పాలా. కాకపోతే ఆలస్యమవుతూ ఉండటంతో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. దీనికన్నా ముందు అనుదీప్ తో ఒక సినిమా చేయాల్సింది కానీ స్టోరీ కుదరక అది కాస్తా రవితేజకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 21, 2024 2:58 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…