టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ దోబూచులాటలో వెనుకబడిపోయిన మంచు మనోజ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 2017 ఒక్కడు మిగిలాడు తర్వాత మంచు హీరో మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు. ఒకటి రెండు క్యామియోలు చేసినా అవి నామమాత్రమే. వ్యక్తిగత జీవితం వల్ల కొంత బ్రేక్ తీసుకున్నప్పటికీ మౌనికతో వివాహమయ్యాక తనలో మునుపటి కళ కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇకపై స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్న మంచు మనోజ్ ని నిజానికి ఎలా వాడుకోవాలో తెలియని దర్శకులే ఎక్కువ. దానికి మిరాయ్ సమాధానమయ్యేలా ఉంది.
ఇవాళ మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మిరాయ్ టీమ్ స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసింది. బ్లాక్ స్వార్డ్ (నల్ల ఖడ్గం) గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు గతంలోనే లీక్ వచ్చింది కానీ ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. పూర్తి స్థాయి విలనా కాదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది కానీ లుక్ పరంగా మనోజ్ నుంచి బెస్ట్ రాబట్టుకున్నాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. లాంచ్ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ కథలు వింటూ బాగా నిరాశ పడుతున్న టైంలో మిరాయ్ ని వినిపించాడని, అద్భుతంగా నచ్చింది కాబట్టి మనసు పెట్టి చేస్తున్నానని ఆనందంగా చెప్పుకున్నాడు.
ఇకపై సెకండ్ ఇన్నింగ్స్ ని ఇలాగే మనోజ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఒకపక్క అన్నయ్య విష్ణు కన్నప్పగా భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇటు చూస్తే మిరాయ్ లాంటి గ్రాండియర్లతో మనోజ్ తిరిగి ఊపందుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వాట్ ది ఫిష్ అనే మరో సినిమా నిర్మాణంలో ఉంది కానీ దాని తాలూకు అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏది ఏమైనా మనోజ్ లాంటి ఆర్టిస్టులు ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా బ్రేక్ దొరుకుతుంది. 2025 ఏప్రిల్ 18న మిరాయ్ ని పది భాషల్లో విడుదలకు రెడీ చేస్తున్నారు.
This post was last modified on May 20, 2024 3:05 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…