Payal Rajput
పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్ 100తో టాలీవుడ్ కు పరిచయమై హిట్టు ఫ్లాపు పక్కపెడితే చెప్పుకోదగ్గ సినిమాలు చేసుకుంటూ వస్తున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు గత ఏడాది మంగళవారం మంచి పేరు తీసుకొచ్చింది. తను 2019లో 5WS అనే సినిమా ఒప్పుకుంది. మరుసటి ఏడాది వరకు షూటింగ్ చేశారు. టైటిల్ అంత క్యాచీగా లేదని రక్షణగా మార్చారు. కానీ విడుదల చేయలేదు. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక్కడితో అయిపోలేదు.
ఫ్రెష్ గా ఆ రక్షణని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమోషన్లకు పాయల్ రాకపోతే బిజినెస్ జరగదు. కానీ ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం బకాయిలు చెల్లించలేదు. ఆ విషయమే పాయల్ అడిగితే దానికి స్పందించకుండా అవమానకర రీతిలో మాట్లాడారు. దీనికి తోడు పాయల్ డేట్లు అందుబాటులో లేని విషయాన్ని ఆమె టీమ్ చెప్పినా కూడా ప్రొడక్షన్ కంపెనీ వినడం లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ పోజ్ చేస్తూ పబ్లిసిటీలో భాగం కావాలనే రీతిలో అభ్యంతరకర భాషలో అడిగారు. అంతే కాదు అనుమతి తీసుకోకుండా రిలీజ్ కూడా సిద్ధమవుతున్నారు.
ఇదంతా పాయల్ రాజ్ పుత్ స్వయంగా చెప్పుకొచ్చి తనకు న్యాయం చేయమని కోరుతోంది. ఏళ్ళ తరబడి పరిశ్రమలో ఉండి వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించిన హీరోయిన్ కు ఇలాంటి పరిస్థితి రావడం ఎంత మాత్రం క్షేమకరం కాదు. రెమ్యునరేషన్లు పూర్తిగా చెల్లించకపోవడం ఒక తప్పయితే తిరిగి రివర్స్ లో మాటల దాడి చేయడం ఇంకా దారుణం. నిజానిజాలు నిర్ధారణ అయ్యాక మా అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అన్నట్టు మంగళవారం 2 తీస్తానని గతంలో చెప్పిన దర్శకుడు అజయ్ భూపతి నిజంగానే ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. పాయల్ తోనే ఉండొచ్చని టాక్.
This post was last modified on May 20, 2024 10:48 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…