నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చిన మాట వాస్తవం. నిజానికి వాళ్ళు ఏవేవో ఊహించుకున్నారు. దీపికా పదుకునే ఇంట్రో ఉంటుందని కొందరు, లేదు ప్రభాస్ గురించి ఏదైనా స్పెషల్ కంటెంట్ వస్తుందని ఇంకొందరు గట్టి అంచనాలు పెట్టేసుకున్నారు. తీరా చూస్తే కథ ప్రకారం బుజ్జి అనే టైం ట్రావెల్ చేసే ఒక కారులో ఉండే బ్రెయినని తెలిశాక షాక్ తిన్నారు. కీర్తి సురేష్ చెప్పిన డబ్బింగ్ వెరైటీగా అనిపించగా టీమ్ దీని కోసం ఎంత కష్టపడింది వాళ్ళతోనే చెప్పించడం బాగుంది.
సరే ఫీడ్ బ్యాక్ సంగతి కాసేపు పక్కనపెడితే కల్కిలో ఈ బుజ్జి ది చాలా కీలక పాత్రని యూనిట్ టాక్. ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను వేల సంవత్సరాలు వెనక్కు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇది ఉండే ఎపిసోడ్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని అంటున్నారు. ఒకరకంగా ఆదిత్య 369 మెషీన్ గుర్తొస్తున్నప్పటికీ దీని మెకానిజం, కాల ప్రయాణం చేసే విధానం ఊహలకు అందని విధంగా దర్శకుడు నాగ అశ్విన్ డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇతర క్యారెక్టర్లు వచ్చి పోతున్నా సరే బుజ్జి మాత్రం చివరిదాకా ఉంటుందట. మరి బ్రెయిన్ కి డబ్బింగ్ పూర్తిగా కీర్తి సురేషే చెబుతుందా లేదా చూడాలి.
ఇంకో రెండు రోజుల్లో ఈ సస్పెన్స్ తీరనుంది. జూన్ 27 ఎంతో దూరంలో లేదు కాబట్టి ఎన్నికల ఫలితాలు రాగానే పబ్లిసిటీ మొదలుపెట్టబోతున్నారు. మొదటి వారం మొత్తం జనంలో ఎలక్షన్ రిజల్ట్ గురించే ఎక్కువ చర్చ ఉంటుంది కాబట్టి సినిమాలను అంతగా పట్టించుకోరు. ఇది పసిగట్టే అశ్వినీదత్ బి బృందం దానికి తగ్గ ప్రణాళికలు వేస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఎక్కువ పాటలు ఉండవట. ఒకటే అని లీక్ ఉంది కానీ రెండు లేదా మూడు ఉండొచ్చని వినికిడి. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ ని లక్ష్యంగా పెట్టుకున్నాడు కల్కి.
This post was last modified on May 19, 2024 12:37 pm
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…