నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చిన మాట వాస్తవం. నిజానికి వాళ్ళు ఏవేవో ఊహించుకున్నారు. దీపికా పదుకునే ఇంట్రో ఉంటుందని కొందరు, లేదు ప్రభాస్ గురించి ఏదైనా స్పెషల్ కంటెంట్ వస్తుందని ఇంకొందరు గట్టి అంచనాలు పెట్టేసుకున్నారు. తీరా చూస్తే కథ ప్రకారం బుజ్జి అనే టైం ట్రావెల్ చేసే ఒక కారులో ఉండే బ్రెయినని తెలిశాక షాక్ తిన్నారు. కీర్తి సురేష్ చెప్పిన డబ్బింగ్ వెరైటీగా అనిపించగా టీమ్ దీని కోసం ఎంత కష్టపడింది వాళ్ళతోనే చెప్పించడం బాగుంది.
సరే ఫీడ్ బ్యాక్ సంగతి కాసేపు పక్కనపెడితే కల్కిలో ఈ బుజ్జి ది చాలా కీలక పాత్రని యూనిట్ టాక్. ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను వేల సంవత్సరాలు వెనక్కు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇది ఉండే ఎపిసోడ్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని అంటున్నారు. ఒకరకంగా ఆదిత్య 369 మెషీన్ గుర్తొస్తున్నప్పటికీ దీని మెకానిజం, కాల ప్రయాణం చేసే విధానం ఊహలకు అందని విధంగా దర్శకుడు నాగ అశ్విన్ డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇతర క్యారెక్టర్లు వచ్చి పోతున్నా సరే బుజ్జి మాత్రం చివరిదాకా ఉంటుందట. మరి బ్రెయిన్ కి డబ్బింగ్ పూర్తిగా కీర్తి సురేషే చెబుతుందా లేదా చూడాలి.
ఇంకో రెండు రోజుల్లో ఈ సస్పెన్స్ తీరనుంది. జూన్ 27 ఎంతో దూరంలో లేదు కాబట్టి ఎన్నికల ఫలితాలు రాగానే పబ్లిసిటీ మొదలుపెట్టబోతున్నారు. మొదటి వారం మొత్తం జనంలో ఎలక్షన్ రిజల్ట్ గురించే ఎక్కువ చర్చ ఉంటుంది కాబట్టి సినిమాలను అంతగా పట్టించుకోరు. ఇది పసిగట్టే అశ్వినీదత్ బి బృందం దానికి తగ్గ ప్రణాళికలు వేస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఎక్కువ పాటలు ఉండవట. ఒకటే అని లీక్ ఉంది కానీ రెండు లేదా మూడు ఉండొచ్చని వినికిడి. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ ని లక్ష్యంగా పెట్టుకున్నాడు కల్కి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…