Movie News

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు – రాజమౌళి సినిమా తాలూకు లీకులతో సోషల్ మీడియా క్రమం తప్పకుండా ఊగుతూనే ఉంది. ఇటీవలే ఒకరు ఫేక్ క్యాస్టింగ్ కాల్ ని పోస్ట్ చేస్తే అది వైరలైన విధానం చూసి స్వయంగా నిర్మాణ సంస్థ అది తప్పని ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. వీలైనంత సమాచారం బయటికి రాకుండా జక్కన్న బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి. విదేశీ హీరోయిన్ ని తీసుకున్న సంగతి కూడా దుర్గా ఆర్ట్స్ చెప్పింది కాదు. ఇప్పుడు ఇంకో అప్డేట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయ్యింది.

కీలకమైన ప్రతినాయక పాత్ర కోసం రాజమౌళి మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ని అనుకుంటున్నట్టు తెలిసింది. సలార్ లో వరదరాజ మన్నార్ గా తన ప్రెజెన్స్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. నటుడిగా అసలు పేరు కంటే క్యారెక్టర్ గానే గుర్తుండిపోయాడు. ఇటీవలే చోటేమియా బడేమియాలో చేశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే మాత్రం పృథ్విరాజ్ డేట్లు ఇవ్వకుండా ఉంటాడా. కాకపోతే అధికారికంగా చెప్పేదాకా ఏది నిజమో ఏది కాదో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది.

స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసిన రాజమౌళి ఈ నెల 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 20ని అఫీషియల్ గా లాంచ్ చేయొచ్చని మహేష్ వర్గాల సమాచారం. ఈ ముహూర్తం కోసమే అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మహేష్ ప్రత్యేకంగా మార్చుకున్న హెయిర్ స్టైల్ ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక ఇక బయటికి రావడం ఉండదని అంటున్నారు. అన్ని భాషల నుంచి ఊహించని ఆర్టిస్టులు ఇందులో పాలు పంచుకుంటారని తెలిసింది. రెండు వారాలు ఆగితే సస్పెన్స్ వీడొచ్చు.

This post was last modified on May 18, 2024 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య పుట్టిన రోజు కానుకలు ఇవేనా?

నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…

2 hours ago

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

4 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

7 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

8 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

9 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

10 hours ago