మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం గత ఏడాది అక్టోబర్ నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. పోనీ ఈ వేసవిలో అయినా వస్తుందేమో అనుకుంటే షూటింగ్ బ్యాలన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యం వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఆ మధ్య వదిలిన పోస్టర్ లో 2024 రిలీజ్ అన్నారు కానీ డేట్ పెట్టలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అజిత్ విదయమయార్చి తప్పుకోవడంతో కంగువని దీపావళి బరిలో దింపడం ఖాయమట.
ఇందులో క్లైమాక్స్ ఫైట్ ని నమ్మశక్యం కాని రీతిలో షూట్ చేయబోతున్నట్టు చెన్నై టాక్. సుమారు 10 వేల జూనియర్ ఆర్టిస్టులతో కనివిని ఎరుగని రీతిలో దీని చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఇంట్రోలో కూడా నాలుగు వేలకు పైగానే ఉంటారు. కానీ అక్కడ విఎఫెక్స్ ప్రధాన భూమిక పోషించింది. కానీ కంగువ కోసం నిజంగానే అంత క్యాస్టింగ్ ని పెడుతున్నారట. సూర్య బాబీ డియోల్ మధ్య ఒళ్ళు జలదరించేలా ఉంటుందట. ఒకరకంగా చెప్పాలంటే మగధీరలో వంద మంది షేర్ ఖాన్ సైన్యంతో ఫైట్ ఎలాగైతే ల్యాండ్ మార్క్ అయ్యిందో దీన్ని అలాగే తీస్తారట.
తెలుగులో యువి సంస్థ భాగస్వామ్యంతో వస్తున్న కంగువ ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ టార్గెట్ తో బరిలో దిగుతోందని కోలీవుడ్ మీడియా ఊదరగొడుతోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ ఫాంటసీ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పార్ట్ 2 ఉంటుందా లేదా అనే దాని గురించి ఇంకా స్పష్టత లేకపోయినా శివ మాత్రం మొత్తం మూడు భాగాలకు సరిపడా కంటెంట్ రాసి ఉంచాడు. మొదటి భాగం హిట్ అయినా కాకపోయినా ఒక పార్ట్ కొనసాగింపు మాత్రం ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
This post was last modified on May 18, 2024 9:49 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…