యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త హోదాలో అటల్ సేతు బ్రిడ్జ్ ని పొగుడుతూ చేసిన వీడియో ఒకటి పెద్ద చర్చకే దారి తీసింది. అసలు ఇంత హఠాత్తుగా మోడీ సర్కారు మీద ప్రశంసలు గుప్పించేలా ఈ యాడ్ ఎందుకు చేసిందనే కామెంట్స్ వినిపిస్తుండగా, ట్రోలర్స్ ఒక అడుగు ముందుకు వేసి తనకేవో కోట్ల రూపాయల పన్ను బకాయిల సమస్య ఉండటం వల్లే ఆ గండం నుంచి బయట పడేందుకు ఈ ప్రకటనకు ఒప్పుకుందనే తరహాలో చిత్ర విచిత్రమైన కథనాలు సోషల్ మీడియాలో అల్లేస్తున్నారు.
ఇవి నిజం కాకపోయినా సరే నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. సెలబ్రిటీనే కాదు ఎవరికైనా దేని గురించైనా తమ అభిప్రాయం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. స్టార్లు కాబట్టి వాళ్ళ ప్రతి మాట, చర్య భూతద్దంలో చూస్తారు. ఇటీవలే అల్లు అర్జున్ జస్ట్ ఫ్రెండ్ కి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్తే ఎంత దుమారం రేగిందో చూస్తున్నాం. ఇప్పుడు రష్మిక చర్య కూడా ఇంచుమించు అలాంటి రియాక్షన్లే తెచ్చుకుంటోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ బ్రిడ్జ్ కైన ఖర్చు, టోల్ రూపంలో వస్తున్న ఆదాయానికి ఏ మాత్రం పొంతన లేదంటూ అంకెలతో సహా ఆధారాలను బయటపెట్టి రీ ట్వీట్ చేసింది.
ఉద్దేశాలు ఏమైనా రష్మిక మందన్నకు సపోర్ట్ గా బిజెపి అనునయులు, ఆమె చేసింది సరికాదని చెప్పేందుకు ఇతర పార్టీల అనుచరులు రెండుగా విడిపోయి డిబేట్లు పెట్టేసుకున్నారు. అయినా సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేసినా ఇలా వేలెత్తి చూపడం ఎంత వరకు సబబని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవల్లికి ఆగస్ట్ లో రిలీజయ్యే పుష్ప 2 ది రూల్ కీలకం కానుంది. దర్శకుడు సుకుమార్ మొదటి భాగాన్ని మించి ఇందులో ఎక్కువ లెన్త్ ఇచ్చాడని, పెర్ఫార్మన్స్ కి భారీ స్కోప్ ఉంటుందని ఆల్రెడీ యూనిట్ నుంచి లీక్స్ వస్తున్నాయి. చూడాలి మరి.
This post was last modified on May 18, 2024 11:13 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…