జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్ అనుకుంటున్నట్టు వచ్చిన లీక్ ఒక్కసారిగా అభిమానుల్లో జోష్ తెచ్చింది. ఇది నిజమో కాదో నిర్ధారణ లేకపోయినా పేరు మాత్రం తారక్ ఇమేజ్ కి తగ్గట్టు పవర్ ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ భారీ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ అయ్యిందట కానీ ఇంకా నటీనటుల ఎంపిక కొలిక్కి రాలేదని సమాచారం. సరే డ్రాగన్ వినేందుకు చెప్పుకునేందుకు బాగానే ఉంది కానీ దీని వెనుక ఊహించని ఒక మెలిక ఉంది.
కొన్ని నెలల క్రితం తెలుగు తమిళంలో డ్రాగన్ అనే బైలింగ్వల్ మూవీ మొదలయ్యింది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ హీరో. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయిందని రిపోర్ట్. ముందే టైటిల్ చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ చేసే ఉంటారు. తెలుగులో చేసుకున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ చేయకపోయినా తమిళనాడు, కేరళలో డ్రాగన్ గానే రిలీజవుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ కేవలం ఒక భాషకే దాన్ని వాడుకోలేడు. సో నిజంగా ఇదే పేరు అనుకుంటే మాత్రం ముందు అర్జెంట్ గా ఈ చిక్కును తొలగించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం దేవర పార్ట్ 1, వార్ 2 షూటింగుల్లో సమాంతరంగా పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చేయాల్సింది ప్రశాంత్ నీల్ మూవీనే. అయితే ఇది ముందు మొదలవుతుందా లేక సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం స్టార్ట్ అవుతుందా అనే కన్ఫ్యూజన్ ఇంకా తీరలేదు. పలు మీడియాల్లో రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వచ్చిన గ్యాప్ కి న్యాయం చేసేందుకు తారక్ వీలైనంత వేగంగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. అక్టోబర్ లో దేవర రిలీజయ్యాక వచ్చే ఏడాది మార్చిలోగా వార్ 2 గుమ్మడికాయ కొట్టేస్తారు. సో ప్రశాంత్ నీల్ కోసం ఎంత సమయమైనా ఇచ్చే వెసులుబాటు తారక్ కు ఉంటుంది.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…