ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నటిదాకా టెన్షన్ పడిన విషయం ఒకటుంది. కల్కి 2898 ఏడి నిర్మాత అశ్వినిదత్ బహిరంగంగా టిడిపి కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ వైసిపి కనక తిరిగి అధికారం చేజిక్కించుకుంటే జూన్ 27న టికెట్ రేట్లు, స్పెషల్ షోల విషయంలో ఇబ్బందులు ఎదురుకోక తప్పదేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు. కట్ చేస్తే నిన్న పోలింగ్ శాతం చూపిస్తున్న ట్రెండ్ ప్రకారం రూలింగ్ పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు, సర్వేలు తేల్చి చెబుతున్నారు. అంటే టీడీపీ జనసేన బిజెపి పొత్తు కుర్చీ దక్కించుకోవడం ఖాయమేనని అంటున్నారు.
ఇది నిజమవుతుందో లేదో తేలడానికి ఇంకో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ పరిణామాలన్నీ మంచి శకునాలుగా భావిస్తున్నారు కల్కి మిత్రులు. ఎందుకంటే టిడిపి వస్తే సినీ రంగానికి సంబంధించి విపరీతమైన ఆంక్షలు ఉండవు. తెలంగాణ తరహాలో పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాట్లు, అవసరమైన మేరకు రాయితీలు లభిస్తాయనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. పైగా కూటమిలో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ స్వయానా సినిమా వాడే కాబట్టి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కల్కి గురించి ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది.
జూన్ 4 ఎలక్షన్ ఫలితాలు వచ్చాక రిలీజయ్యే మొదటి ప్యాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడినే. దేశమంతా బాక్సాఫీస్ బాగా డ్రైగా ఉన్న టైంలో ఒక్కసారిగా దానికి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చే సినిమాగా ట్రేడ్ నుంచి మూవీ లవర్స్ దాకా అందరి ఆశలు దీని మీదే ఉన్నాయి. పైగా ఓపెనింగ్స్ పరంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లను సునాయాసంగా దాటేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో కల్కికి అన్నిరకాలుగా ప్రభుత్వాల నుంచి మద్దతు దక్కాలి. అశ్వినీదత్ కోరుకున్నట్టు టిడిపి జనసేన వస్తేనే ఇది సాధ్యమవుతుంది. చూడాలి ఏం జరగనుందో.
This post was last modified on May 14, 2024 3:34 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…