ఒకప్పుడు చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో ఉండటం చూస్తూనే ఉన్నాం. నేనే రాజు నేనే మంత్రి ఒక్కటే సక్సెస్ కొట్టగా సీత జనాల సహనాన్ని పరీక్షించింది. దగ్గుబాటి అభిరాంని పరిచయం చేసిన అహింసని జనాలు మేము తట్టుకోలేమంటూ ఫ్లాప్ చేశారు. అయినా సరే సురేష్ బాబుకి తేజ మీద బోలెడు నమ్మకం. అందుకే రానాతో రాక్షస రాజు చేసే ఛాన్స్ ఇచ్చారు. గత ఏడాదే ఘనంగా ప్రకటించారు కానీ రెగ్యులర్ షూటింగ్ కి ఇంకా వెళ్ళలేదు. ఇంతకీ ప్రాజెక్టు ఉంటుందా లేదా అంటే అంటే చెప్పలేమని ఇన్ సైడ్ టాక్. అనుమానం వచ్చేందుకు కారణాలున్నాయి.
కొన్నేళ్ల క్రితం వెంకటేష్ తో ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ తో ఓ సినిమాని తేజతో ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం రామానాయుడు స్టూడియోస్ లో క్యాస్టింగ్ కోసం ఆడిషన్లు జరిగాయి. తీరా కొన్ని సీన్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత గోపీచంద్ తో ఒక మూవీ ఫిక్స్ అయ్యింది. కథ కూడా సిద్ధమే. ఏమైందో కానీ పట్టాలు ఎక్కలేదు. ఇదంతా కాదని తేజ తన కొడుకునే హీరోగా పెట్టి చిత్రం 2 తీద్దామనుకున్నారు. కానీ బిజినెస్ పరంగా వర్కౌట్ కాదనే ఆలోచనతో డ్రాప్ అయ్యారు. ఇప్పుడు రాక్షస రాజు తాలూకు అప్డేట్స్ జాడే లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి.
సోలో హీరోగా రానాకు బ్రేక్ ఇచ్చిన తేజ రాక్షస రాజుని మంచి డెప్త్ తో రాసుకున్నారనే టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ రానా చూస్తేనేమో రజనీకాంత్ వెట్టయన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తప్పించి తేజకు సంబంధించిన కబుర్లు చెప్పడం లేదు. షూటింగ్ ఉన్నా లేకపోయినా క్రమం తప్పకుండా ఒక కాంబో గురించిన వార్తలు, విశేషాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయటికి వస్తుండాలి. అప్పుడే ఆడియన్స్ దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ రాక్షస రాజు గురించి ఎలాంటి సౌండ్ లేకపోవడం మాత్రం వింతే. హీరోయిన్ ఎవరో కూడా తేలలేదు.
This post was last modified on May 10, 2024 5:40 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…