అదేంటి ఒక సంఖ్య మీద హీరో ఫ్యాన్స్ కి కోపం రావడం ఏమిటనుకుంటున్నారా. దానికి సహేతుకమైన కారణమే ఉంది లెండి. నిన్న ప్రకటించిన విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబో మూవీ దిల్ రాజు గారి ఎస్విసి సంస్థకు 59వ సినిమా. మూడేళ్ళకు ముందు గేమ్ ఛేంజర్ అనౌన్స్ చేసినప్పుడు అది తమ బ్యానర్ 50వ చిత్రమని అప్పట్లో టీమ్ గర్వంగా ప్రకటించింది. తీరా చూస్తే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అప్పన్న, రామ్ నందన్ గా మెగా పవర్ స్టార్ వెండితెర దర్శనం మాత్రం జరగడం లేదని అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అందుకే ఈ ఆగ్రహావేశం.
అంటే గేమ్ ఛేంజర్ అనౌన్స్ చేశాక మరో తొమ్మిది సినిమాల దాకా వచ్చిన దిల్ రాజు అంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయన చేతుల్లో ఏం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దర్శకుడు శంకర్ ఏదీ తేల్చడం లేదు. ఒకపక్క దీని షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు భారతీయుడు 2కి సంబంధించిన రిలీజ్ డేట్ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉన్నారు. దీని వల్ల రెండింటికి నష్టమే జరుగుతోంది. ముందు జూన్ అనుకున్న ఇండియన్ 2 ఇప్పుడు జూలైకి వెళ్ళింది. అప్పుడూ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఏది జరగాలన్నా అంతా శంకరే కరుణ చూపాలి.
మొన్నటిదాకా అక్టోబర్ మీద నమ్మకం పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్ కు మెల్లగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆ సూచనలు తగ్గుముఖం పట్టాయి. అలా అని జనవరి మీద ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే చిరంజీవి విశ్వంభర ఆల్రెడీ లాక్ అయ్యుంది. పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు. ఒకవేళ ఇదేమైనా మిస్ అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని దించే అవకాశాలు కొట్టి పారేయలేం. అదే జరిగితే గేమ్ ఛేంజర్ మళ్ళీ వేసవికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంతదాకా వెళ్లకూడదనే దిల్ రాజు సంకల్పం. చివరికి ఏమవుతుందో మాత్రం విక్రమార్కుడు కూడా చెప్పలేని భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది.
This post was last modified on May 10, 2024 8:17 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…