గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్ భాగస్వామిగా కొన్నేళ్ల క్రితమే మధు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టి ఆ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. అయిదు వందల కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే ప్రచారం జరిగింది. కాకపోతే క్యాస్టింగ్ ఎవరనేది నిర్ణయించముందే దీన్ని ఆపేశారు. కట్ చేస్తే కొంత గ్యాప్ తర్వాత పట్టాలెక్కింది.
ఒప్పందంలో భాగంగా మధు మంతెన, అల్లు అరవింద్ లకు ప్రైమ్ ఫోకస్ నుంచి చెల్లింపులు రావాలనేది నోటీసు సారాంశం. తమ అనుమతి లేకుండా ఎలాంటి హక్కులు మీకు చెందవనేది అందులో పేర్కొన్నారు. సాంకేతికంగా పూర్తి వివరాలు నోటీసులో వెల్లడించలేరు కాబట్టి ఉన్నంతలో మెయిన్ పాయింట్ అయితే ఇదే. నితీష్ తివారి లేదా వేరేవారు దర్శకత్వం వహించినా తమకున్న రైట్స్ ని ఉల్లఘించి ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు కానీ రేపో ఎల్లుండో జరుగుతుంది.
రామాయణంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించడంతో పాటు పార్ట్ నర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ తాలూకు లీకైన పిక్స్ ఇటీవలే సోషల్ మీడియాలో హల్చల్ చేశాక నిర్మాణ సంస్థ జాగ్రత్త వహించి మళ్ళీ అవి బయటికి రాకుండా చర్యలు తీసుకుంది. సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. ఏ వివరాలు బయటికి చెప్పకుండా గుట్టుని మెయిటైన్ చేయడం వెనుక రహస్యం ఇదాని చెవులు కోరుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. చూడాలి ఈ కాంట్రావర్సి ఎక్కడి దాకా వెళ్తుందో ఏ మలుపు తిరుగుతుందో.
This post was last modified on July 7, 2025 11:22 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…