Movie News

రామాయణంపై అప్పుడే వివాదాలు షురూ

గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్ భాగస్వామిగా కొన్నేళ్ల క్రితమే మధు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టి ఆ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. అయిదు వందల కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే ప్రచారం జరిగింది. కాకపోతే క్యాస్టింగ్ ఎవరనేది నిర్ణయించముందే దీన్ని ఆపేశారు. కట్ చేస్తే కొంత గ్యాప్ తర్వాత పట్టాలెక్కింది.

ఒప్పందంలో భాగంగా మధు మంతెన, అల్లు అరవింద్ లకు ప్రైమ్ ఫోకస్ నుంచి చెల్లింపులు రావాలనేది నోటీసు సారాంశం. తమ అనుమతి లేకుండా ఎలాంటి హక్కులు మీకు చెందవనేది అందులో పేర్కొన్నారు. సాంకేతికంగా పూర్తి వివరాలు నోటీసులో వెల్లడించలేరు కాబట్టి ఉన్నంతలో మెయిన్ పాయింట్ అయితే ఇదే. నితీష్ తివారి లేదా వేరేవారు దర్శకత్వం వహించినా తమకున్న రైట్స్ ని ఉల్లఘించి ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు కానీ రేపో ఎల్లుండో జరుగుతుంది.

రామాయణంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించడంతో పాటు పార్ట్ నర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ తాలూకు లీకైన పిక్స్ ఇటీవలే సోషల్ మీడియాలో హల్చల్ చేశాక నిర్మాణ సంస్థ జాగ్రత్త వహించి మళ్ళీ అవి బయటికి రాకుండా చర్యలు తీసుకుంది. సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. ఏ వివరాలు బయటికి చెప్పకుండా గుట్టుని మెయిటైన్ చేయడం వెనుక రహస్యం ఇదాని చెవులు కోరుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. చూడాలి ఈ కాంట్రావర్సి ఎక్కడి దాకా వెళ్తుందో ఏ మలుపు తిరుగుతుందో.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

13 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago