లేక లేక ఎన్నో నెలల తర్వాత ఈ మధ్యే హైదరాబాద్ సిటీ దాటి బయటికెళ్లాడు అల్లు అర్జున్. కానీ అతడితో పాటే వివాదం కూడా వెంట వచ్చేసింది. కరోనా కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశం నిషిద్ధమైన ప్రాంతానికి వెళ్లి బన్నీ అండ్ కో హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది.
నాలుగు రోజుల కిందట అక్కడి కుంటాల జలపాతాన్ని తన బృందంతో కలిసి సందర్శించడంపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాన్య జనానికి ఈ జలపాతం చూసేందుకు అనుమతి ఇవ్వని అధికారులు.. అల్లు అర్జున్కు మాత్రం ఎలా అవకాశం ఇచ్చారని జనాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ ప్రభుత్వ అధికారి సైతం దీన్ని తప్పుబట్టినట్లు అప్పుడు మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అంతటితో వ్యవహారం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఈ విషయమై బన్నీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం చర్చనీయాంశమైంది.
బన్నీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని, అలాగే సమీపంలో ఉన్న తిప్పేశ్వర్లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ప్రకటించారు.
మరోవైపు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించాడంటూ బన్నీ మీద ఆ జిల్లా అటవీ అధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు సదరు సంఘం ప్రతినిధులు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి లేఖ అందించి వచ్చారు.
ఐతే మహారాష్ట్ర పరిధిలోని తిప్పేశ్వర్లో బన్నీ మొన్న షూటింగ్ లాంటిదేమీ చేసినట్లయితే వార్తలు రాలేదు. తన కొత్త సినిమా ‘పుష్ప’ కోసం లొకేషన్లు పరిశీలించడానికే అతను ఈ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. బహుశా కెమెరామన్ను వెంట తీసుకెళ్ల విజువల్స్ తీసుకోవడంతో షూటింగ్ చేశారని అనుకున్నారేమో.
This post was last modified on September 17, 2020 1:04 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…