లేక లేక ఎన్నో నెలల తర్వాత ఈ మధ్యే హైదరాబాద్ సిటీ దాటి బయటికెళ్లాడు అల్లు అర్జున్. కానీ అతడితో పాటే వివాదం కూడా వెంట వచ్చేసింది. కరోనా కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశం నిషిద్ధమైన ప్రాంతానికి వెళ్లి బన్నీ అండ్ కో హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది.
నాలుగు రోజుల కిందట అక్కడి కుంటాల జలపాతాన్ని తన బృందంతో కలిసి సందర్శించడంపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాన్య జనానికి ఈ జలపాతం చూసేందుకు అనుమతి ఇవ్వని అధికారులు.. అల్లు అర్జున్కు మాత్రం ఎలా అవకాశం ఇచ్చారని జనాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ ప్రభుత్వ అధికారి సైతం దీన్ని తప్పుబట్టినట్లు అప్పుడు మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అంతటితో వ్యవహారం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఈ విషయమై బన్నీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం చర్చనీయాంశమైంది.
బన్నీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని, అలాగే సమీపంలో ఉన్న తిప్పేశ్వర్లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ప్రకటించారు.
మరోవైపు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించాడంటూ బన్నీ మీద ఆ జిల్లా అటవీ అధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు సదరు సంఘం ప్రతినిధులు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి లేఖ అందించి వచ్చారు.
ఐతే మహారాష్ట్ర పరిధిలోని తిప్పేశ్వర్లో బన్నీ మొన్న షూటింగ్ లాంటిదేమీ చేసినట్లయితే వార్తలు రాలేదు. తన కొత్త సినిమా ‘పుష్ప’ కోసం లొకేషన్లు పరిశీలించడానికే అతను ఈ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. బహుశా కెమెరామన్ను వెంట తీసుకెళ్ల విజువల్స్ తీసుకోవడంతో షూటింగ్ చేశారని అనుకున్నారేమో.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…