లేక లేక ఎన్నో నెలల తర్వాత ఈ మధ్యే హైదరాబాద్ సిటీ దాటి బయటికెళ్లాడు అల్లు అర్జున్. కానీ అతడితో పాటే వివాదం కూడా వెంట వచ్చేసింది. కరోనా కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశం నిషిద్ధమైన ప్రాంతానికి వెళ్లి బన్నీ అండ్ కో హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది.
నాలుగు రోజుల కిందట అక్కడి కుంటాల జలపాతాన్ని తన బృందంతో కలిసి సందర్శించడంపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాన్య జనానికి ఈ జలపాతం చూసేందుకు అనుమతి ఇవ్వని అధికారులు.. అల్లు అర్జున్కు మాత్రం ఎలా అవకాశం ఇచ్చారని జనాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ ప్రభుత్వ అధికారి సైతం దీన్ని తప్పుబట్టినట్లు అప్పుడు మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అంతటితో వ్యవహారం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఈ విషయమై బన్నీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం చర్చనీయాంశమైంది.
బన్నీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని, అలాగే సమీపంలో ఉన్న తిప్పేశ్వర్లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ప్రకటించారు.
మరోవైపు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించాడంటూ బన్నీ మీద ఆ జిల్లా అటవీ అధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు సదరు సంఘం ప్రతినిధులు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి లేఖ అందించి వచ్చారు.
ఐతే మహారాష్ట్ర పరిధిలోని తిప్పేశ్వర్లో బన్నీ మొన్న షూటింగ్ లాంటిదేమీ చేసినట్లయితే వార్తలు రాలేదు. తన కొత్త సినిమా ‘పుష్ప’ కోసం లొకేషన్లు పరిశీలించడానికే అతను ఈ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. బహుశా కెమెరామన్ను వెంట తీసుకెళ్ల విజువల్స్ తీసుకోవడంతో షూటింగ్ చేశారని అనుకున్నారేమో.
This post was last modified on September 17, 2020 1:04 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…