లేక లేక ఎన్నో నెలల తర్వాత ఈ మధ్యే హైదరాబాద్ సిటీ దాటి బయటికెళ్లాడు అల్లు అర్జున్. కానీ అతడితో పాటే వివాదం కూడా వెంట వచ్చేసింది. కరోనా కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశం నిషిద్ధమైన ప్రాంతానికి వెళ్లి బన్నీ అండ్ కో హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది.
నాలుగు రోజుల కిందట అక్కడి కుంటాల జలపాతాన్ని తన బృందంతో కలిసి సందర్శించడంపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాన్య జనానికి ఈ జలపాతం చూసేందుకు అనుమతి ఇవ్వని అధికారులు.. అల్లు అర్జున్కు మాత్రం ఎలా అవకాశం ఇచ్చారని జనాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ ప్రభుత్వ అధికారి సైతం దీన్ని తప్పుబట్టినట్లు అప్పుడు మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అంతటితో వ్యవహారం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఈ విషయమై బన్నీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం చర్చనీయాంశమైంది.
బన్నీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని, అలాగే సమీపంలో ఉన్న తిప్పేశ్వర్లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ప్రకటించారు.
మరోవైపు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించాడంటూ బన్నీ మీద ఆ జిల్లా అటవీ అధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు సదరు సంఘం ప్రతినిధులు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి లేఖ అందించి వచ్చారు.
ఐతే మహారాష్ట్ర పరిధిలోని తిప్పేశ్వర్లో బన్నీ మొన్న షూటింగ్ లాంటిదేమీ చేసినట్లయితే వార్తలు రాలేదు. తన కొత్త సినిమా ‘పుష్ప’ కోసం లొకేషన్లు పరిశీలించడానికే అతను ఈ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. బహుశా కెమెరామన్ను వెంట తీసుకెళ్ల విజువల్స్ తీసుకోవడంతో షూటింగ్ చేశారని అనుకున్నారేమో.
This post was last modified on September 17, 2020 1:04 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…