మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు రోజులు కొంత డీసెంట్ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత అమాంతం చల్లారిపోయింది. సుహాస్ ప్రసన్నవదనంకు రివ్యూస్ బాగున్నా, పబ్లిక్ పాజిటివ్ గా స్పందించినా కలెక్షన్లు మాత్రం సోసోనే. అయితే తమన్నా రాశిఖన్నాల బాక్ అరణ్మణై 4 మాస్ అండతో గట్టెక్కిపోవడం ఊహించనిది. తెలుగు డబ్బింగ్ ఫ్లాపే కానీ మాస్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా లాగించగా తమిళంలో మాత్రం మొదటి వారం పూర్తి కాకుండానే యాభై కోట్ల గ్రాస్ తేవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.
దర్శకుడు సి సుందర్ కంటెంట్, టేకింగ్ రెండూ రొటీన్ గానే ఉన్నప్పటికీ క్వాలిటీగా అనిపించిన విజువల్ ఎఫెక్ట్స్, హీరోయిన్ల గ్లామర్, మాస్ కి నచ్చే కొన్ని హారర్ ఎపిసోడ్లు వర్కౌట్ అయ్యాయి. అన్నింటికన్నా అసలే పోటీ లేకుండా సోలోగా దిగడం బాగా కలిసి వచ్చింది. ఇక్కడ బాక్ అద్భుతాలు చేయకపోయినా జరిగిన తక్కువ బిజినెస్ కు తగ్గట్టు నష్టాల శాతం తీవ్రంగా లేకుండా చూసుకోవడం ఒక్కటే కొంత ఊరట కలిగించిందని బయ్యర్స్ టాక్. దెయ్యాల కామెడీ టాలీవుడ్ జనాలకు బోర్ కొట్టేసింది. అందుకే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఎంత పబ్లిసిటీ చేసినా ప్రయోజనం దక్కించుకోలేదు.
బాక్ కూడా అదే క్యాటగిరీ కావడంతో ఎలాంటి మేజిక్ చేయలేదు. అయితే కాస్త ట్రెండీ టచ్ ఇస్తే భారీగా కాకపోయినా నిర్మాత లాభం కళ్లజూసేలా మెప్పించవచ్చని ఓం భీం బుష్ నిరూపించింది. కానీ బాక్ లో మ్యాటర్ అంత స్థాయిలో లేదు. సుందర్ సి ఇప్పుడు అయిదో భాగం కూడా తీస్తారట. హీరోయిన్లతో పాటు క్రేజీ హీరో క్యాస్టింగ్ ని సెట్ చేసుకుని స్కేల్ పెంచుతానని అంటున్నాడు. లారెన్స్ తరహాలో జనాలకు మొహం మొత్తి ఇక చాలు బాబోయ్ అనేవరకు దెయ్యం సినిమాలు వదులుతూనే ఉంటాడు కాబోలు. అన్నట్టు ఎప్పుడో ఆగిపోయిన ఈయన ప్యాన్ ఇండియా మూవీ సంఘమిత్ర మళ్ళీ వార్తలోకి వస్తోంది.
This post was last modified on May 9, 2024 10:51 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…