Movie News

రొటీన్ అంటూనే 50 కోట్లు లాగేసింది

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు రోజులు కొంత డీసెంట్ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత అమాంతం చల్లారిపోయింది. సుహాస్ ప్రసన్నవదనంకు రివ్యూస్ బాగున్నా, పబ్లిక్ పాజిటివ్ గా స్పందించినా కలెక్షన్లు మాత్రం సోసోనే. అయితే తమన్నా రాశిఖన్నాల బాక్ అరణ్మణై 4 మాస్ అండతో గట్టెక్కిపోవడం ఊహించనిది. తెలుగు డబ్బింగ్ ఫ్లాపే కానీ మాస్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా లాగించగా తమిళంలో మాత్రం మొదటి వారం పూర్తి కాకుండానే యాభై కోట్ల గ్రాస్ తేవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.

దర్శకుడు సి సుందర్ కంటెంట్, టేకింగ్ రెండూ రొటీన్ గానే ఉన్నప్పటికీ క్వాలిటీగా అనిపించిన విజువల్ ఎఫెక్ట్స్, హీరోయిన్ల గ్లామర్, మాస్ కి నచ్చే కొన్ని హారర్ ఎపిసోడ్లు వర్కౌట్ అయ్యాయి. అన్నింటికన్నా అసలే పోటీ లేకుండా సోలోగా దిగడం బాగా కలిసి వచ్చింది. ఇక్కడ బాక్ అద్భుతాలు చేయకపోయినా జరిగిన తక్కువ బిజినెస్ కు తగ్గట్టు నష్టాల శాతం తీవ్రంగా లేకుండా చూసుకోవడం ఒక్కటే కొంత ఊరట కలిగించిందని బయ్యర్స్ టాక్. దెయ్యాల కామెడీ టాలీవుడ్ జనాలకు బోర్ కొట్టేసింది. అందుకే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఎంత పబ్లిసిటీ చేసినా ప్రయోజనం దక్కించుకోలేదు.

బాక్ కూడా అదే క్యాటగిరీ కావడంతో ఎలాంటి మేజిక్ చేయలేదు. అయితే కాస్త ట్రెండీ టచ్ ఇస్తే భారీగా కాకపోయినా నిర్మాత లాభం కళ్లజూసేలా మెప్పించవచ్చని ఓం భీం బుష్ నిరూపించింది. కానీ బాక్ లో మ్యాటర్ అంత స్థాయిలో లేదు. సుందర్ సి ఇప్పుడు అయిదో భాగం కూడా తీస్తారట. హీరోయిన్లతో పాటు క్రేజీ హీరో క్యాస్టింగ్ ని సెట్ చేసుకుని స్కేల్ పెంచుతానని అంటున్నాడు. లారెన్స్ తరహాలో జనాలకు మొహం మొత్తి ఇక చాలు బాబోయ్ అనేవరకు దెయ్యం సినిమాలు వదులుతూనే ఉంటాడు కాబోలు. అన్నట్టు ఎప్పుడో ఆగిపోయిన ఈయన ప్యాన్ ఇండియా మూవీ సంఘమిత్ర మళ్ళీ వార్తలోకి వస్తోంది.

This post was last modified on May 9, 2024 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

35 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

38 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago