టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద రెండు వందల కోట్లు దాటడమే గొప్ప ఘనత భావించే బాక్సాఫీస్ కు తొలిసారి వేయి కోట్ల రుచి చూపించి ఎందరో ఫిలిం మేకర్స్ కి తిరుగు లేని ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభాస్ ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ డంకి బలమైన పునాది వేసింది ఈ బ్లాక్ బస్టరే. దాని ప్రభావం వల్లే డార్లింగ్ మూవీస్ కమర్షియల్ గా ఎలాంటి ఫలితాలు అందుకుంటున్నా ప్రతి ప్రాజెక్టుకి క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అంతగా బాహుబలి జనాల్లోకి చొచ్చుకుపోయిందనేది కాదనలేని వాస్తవం.
ఇప్పుడు యానిమేషన్ సిరీస్ వస్తోంది. వచ్చే వారం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నిన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన కబుర్లను పంచుకున్నారు. భవిష్యత్తులో బాహుబలిని మరింత విసృతం చేస్తామని నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు రాజమౌళి కూడా అన్నారు. అయితే నిజంగా దీని బ్రాండ్ విలువ ఎప్పటికీ తగ్గకుండా ఉంటుందా అంటే డౌటేనంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే థియేట్రికల్ గా ఒక సినిమా ఇచ్చిన ఫీల్ ఎంత గ్రాండ్ గా ఉన్నా సరే యానిమేషన్ ఇవ్వదనేది తెలిసిందే. అలాంటప్పుడు ప్రేక్షకులు విరగబడి దాన్ని చూస్తారని అనుకోవడానికి లేదు.
పైగా ట్రైలర్ విజువల్స్ మరీ ఎక్స్ ట్రాడినరిగా అనిపించకపోవడం ఎలాంటి స్పందన తెస్తుందో చూడాలి. ఒకవేళ అసలు కంటెంట్ వచ్చాక అభిప్రాయం మారుతుందేమో. కొన్నేళ్ల క్రితం బాహుబలిని నెట్ ఫ్లిక్స్ కోసం రియల్ వెబ్ సిరీస్ గా తీయాలని ప్రయత్నించి కొంత షూటింగ్ అయ్యాక అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఆపేశారు. క్రేజ్ ఉన్నప్పుడే ఇలా జరిగితే బాహుబలి గురించి జనం దాదాపు మర్చిపోయిన టైంలో మళ్ళీ ఆ స్థాయి హైప్ తీసుకురావడం సులభం కాదు. అసలే జక్కన్న మహేష్ బాబు సినిమా కోసం ఇంకో రెండు మూడేళ్లు దొరకడం కష్టం. మరి బాహుబలి బాధ్యతను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.
This post was last modified on May 8, 2024 5:22 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…