Movie News

ప్రతినిధి-2.. టార్గెట్ జగనేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట రాజకీయ నేపథ్యం ఉన్న పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2, వ్యూహం, శపథం లాంటి చిత్రాలు వస్తే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం లాంటి సినిమాలు రిలీజయ్యాయి. ఇప్పుడు ‘ప్రతినిధి-2’ పేరుతో మరో పొలిటికల్ మూవీ ప్రేక్షకులను పలకరించబోతోంది.

ముందు ఈ సినిమా ప్రోమోలు చూస్తే పైన చెప్పుకున్న సినిమాలకు కొంచెం భిన్నం అనుకున్నారు. సగటు కమర్షియల్ సినిమాల ఫార్మాట్లోనే సినిమా తీసి.. అందులో అంతర్లీనంగా రాజకీయ అంశాలు జొప్పించారని అనుకున్నారు. కానీ మే 10న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు లాంచ్ చేసిన రిలీజ్ ట్రైలర్ చూస్తే ఆ ఆలోచన మారిపోతుంది.

ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఈ సినిమా తీశారని రిలీజ్ ట్రైలర్లో స్పష్టమైంది. ఇందులో ‘ప్లే బ్యాక్’ మూవీ ఫేమ్ దీపక్ తేజ్ పోషించిన పాత్ర జగన్‌ను తలపిస్తోంది. ‘ప్రతినిధి-2’ ఒక ముఖ్యమంత్రి హత్య చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుండగా.. ఆ చనిపోయిన ముఖ్యమంత్రి కొడుకు పాత్రలో దీపక్ తేజ్ నటించాడు.

తండ్రి చనిపోయినపుడు అందరూ ఆయన స్థానంలో పదవి చేపట్టాలని అడిగితే నాన్న చనిపోయిన పది గంటలకే నన్ను పదవి తీసుకోమంటారేంటి అని అతను ప్రశ్నించడం.. ఆపై కుర్చీలో కూర్చున్నాక మన చేతిలో అధికారం ఉంది కాబట్టి కేసులు అలాగే ఉంటాయి తప్ప ఏ ప్రోగ్రెస్ ఉండదనే డైలాగ్ చెప్పడం.. ముఖ్యమంత్రి హత్య కేసుకు సంబంధించి అతణ్ని పోలీస్ అధికారి ప్రశ్నలడగడం లాంటి సన్నివేశాలు ట్రైలర్లో కనిపించాయి. ఈ పాత్రను చూసి ప్రేక్షకులు జగన్‌తో రిలేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే దాన్ని తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. మరి సినిమాలో ఈ పాత్ర ద్వారా ఇంకెంతగా జగన్‌ను టార్గెట్ చేస్తారో చూడాలి.

This post was last modified on May 8, 2024 3:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago