నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ప్రతినిధి-2. ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఒకే సమయంలో అరడజనుకు పైగా చిత్రాలను లైన్లో పెట్టిన అతను కొన్నేళ్ల పాటు స్క్రీన్ మీదే కనిపించలేదు. తన కెరీర్లో మంచి హిట్గా నిలిచిన ప్రతినిధి సినిమాకు కొనసాగింపుగా ప్రతినిధి-2తో అతను రీఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. న్యూస్ ప్రెజెంటర్ అయిన మూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం విశేషం.
రాజకీయ చిత్రం కావడం, ఎన్నికల ముంగిటే రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో దీని పట్ల ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తింది. టీజర్, ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా అనిపించాయి. కానీ ముందు ఫిబ్రవరికి అనుకుని.. ఆ తర్వాత ఏప్రిల్ 25కు వాయిదా పడ్డ ఈ చిత్రం.. ఆ డేట్కూ రిలీజ్ కాలేదు.
సెన్సార్, ఇంకేవో ఇబ్బందులతో సినిమాను ఏప్రిల్ 25 డేట్ నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ మూవీకి కొత్త డేట్ ఇచ్చారు. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు, అంటే మే 10న ప్రతినిధి-2ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ను పరోక్షంగా ఈ సినిమాలో టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. ట్రైలర్లో కూడా ఆ సంకేతాలు కనిపించాయి. అలా అని ఇది ప్రాపగండా మూవీలా లేదు. కమర్షియల్ విలువలూ కనిపిస్తున్నాయి.
ఇలాంటి చిత్రం ఎన్నికల ముంగిట వస్తేనే ప్రయోజనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రిలీజ్ చేసి తీరాల్సిందే. కానీ సెన్సార్ అడ్డంకులన్నీ దాటుకుని.. రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఈ చిత్రం మే 10న అయినా పక్కాగా థియేటర్లలోకి దిగుతుందా అన్నది సందేహం. అలా కాని పక్షంలో ఈ సినిమా తీసిన ప్రయోజనం నెరవేరకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 5, 2024 11:07 am
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…