మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ మూవీ ‘ఆచార్య’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని స్వయంగా చిరంజీవి ప్రకటించారు.
‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఒప్పించి మరీ నెలరోజుల పాటు చరణ్ డేట్స్ తీసుకున్నాడట చిరూ. సోషియో- పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యంగ్ ఏజ్లో ఉన్న చిరంజీవిగా కనిపిస్తాడని టాక్. ఇప్పుడు ఈ మూవీలో మరో మెగా వారసురాలు కూడా కనిపించబోతుందని సమాచారం.
మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు కొణిదెల నిహారిక, ‘ఆచార్య’ మూవీలో అతిథి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చరణ్కి చెల్లిగా నిహారిక కనిపిస్తుందని, అన్నాచెల్లెల ఎపిసోడ్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని అంటున్నారు. చిన్న పాత్రే అయినా కథను మలుపు తిప్పే పాత్రలో నిహారిక నటిస్తోందని సమాచారం. అయితే ఈ వార్త నిజం కాకూడదని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే నటిగా నిరూపించుకున్నప్పటికీ నిహారిక ఇప్పటిదాకా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు. మెగా డాటర్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
అంతెందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ‘సైరా’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది నిహారిక. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది. అందుకే ఒకవేళ ‘ఆచార్య’ రిజల్ట్ తేడాకొడితే, దానికి నిహారికనే బాధ్యురాలిని చేస్తారని… మెగా డాటర్ సరైన సక్సెస్ అందుకునేదాకా ఇలాంటి రోల్స్కు దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
This post was last modified on April 27, 2020 5:55 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…