మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ మూవీ ‘ఆచార్య’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని స్వయంగా చిరంజీవి ప్రకటించారు.
‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఒప్పించి మరీ నెలరోజుల పాటు చరణ్ డేట్స్ తీసుకున్నాడట చిరూ. సోషియో- పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యంగ్ ఏజ్లో ఉన్న చిరంజీవిగా కనిపిస్తాడని టాక్. ఇప్పుడు ఈ మూవీలో మరో మెగా వారసురాలు కూడా కనిపించబోతుందని సమాచారం.
మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు కొణిదెల నిహారిక, ‘ఆచార్య’ మూవీలో అతిథి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చరణ్కి చెల్లిగా నిహారిక కనిపిస్తుందని, అన్నాచెల్లెల ఎపిసోడ్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని అంటున్నారు. చిన్న పాత్రే అయినా కథను మలుపు తిప్పే పాత్రలో నిహారిక నటిస్తోందని సమాచారం. అయితే ఈ వార్త నిజం కాకూడదని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే నటిగా నిరూపించుకున్నప్పటికీ నిహారిక ఇప్పటిదాకా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు. మెగా డాటర్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
అంతెందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ‘సైరా’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది నిహారిక. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది. అందుకే ఒకవేళ ‘ఆచార్య’ రిజల్ట్ తేడాకొడితే, దానికి నిహారికనే బాధ్యురాలిని చేస్తారని… మెగా డాటర్ సరైన సక్సెస్ అందుకునేదాకా ఇలాంటి రోల్స్కు దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
This post was last modified on April 27, 2020 5:55 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…
ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…