తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పాత్రలు చేయకపోయినా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే వాటిని క్రమం తప్పకుండా దక్కించుకుంటున్న ఈ కోలీవుడ్ ఆర్టిస్ట్ కొత్త సినిమా శబరి నిన్న విడుదలయ్యింది. ప్యాన్ ఇండియా తరహాలో బహు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడంతో ఏదో ప్రత్యేకమైన కంటెంట్ ఉంటుందనే అంచనాలు ఆడియన్స్ లో ఉన్నాయి. ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్నవదనం, బాక్ అరణ్మయి 4తో పోటీకి దిగిన శబరిలో అసలు మ్యాటర్ ఏముందో, మెప్పించిందో లేదో చూద్దాం.
సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన ఒక్కగానొక్క కూతురు రియా(బేబీ వివేక్ష)ని తీసుకుని ఉద్యోగం కోసం అటవీ ప్రాంతం పాడేరుకి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్(గణేష్ వెంకట్రామన్) వంచించడంతో అతన్ని వదిలేసి విడాకులకు అప్లై చేస్తుంది. ఊరికి దూరంగా ఇల్లు తీసుకున్న సంజన వెనుక పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న సూర్య (మైమ్ గోపీ) నుంచి వేధింపులు మొదలవుతాయి. పలుమార్లు హత్య ప్రయత్నం చేస్తాడు. సంజన స్నేహితుడు లాయర్ రాహుల్(శశాంక్) ఈమెకు అండగా ఉంటాడు. ఈ ప్రమాదకరమైన వలయం నుంచి సంజన ఎలా బయటపడిందనేది స్టోరీ.
దర్శకుడు అనిల్ కాట్జ్ అప్పుడెప్పుడో వచ్చిన సర్వంని స్ఫూర్తిగా తీసుకుని ఈ సైకాలజికల్ థ్రిల్లర్ రాసుకున్నాడు కానీ విపరీతమైన సాగతీత, ఏ మాత్రం ఆసక్తి కలిగించని సన్నివేశాలతో శబరి చాలా భారంగా కదులుతుంది. సంజన వెనుక సూర్య పడే తతంగాన్ని అదే పనిగా రిపీట్ చేయడం చిరాకు తెప్పిస్తుంది. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింటే సిల్లీగా తోస్తుంది. ఆసుపత్రిలో బిడ్డ మార్పిడిని థ్రిల్లర్ కి ముడిపెట్టాలని చూసి ఎటెటో తీసుకుపోయాడు అనిల్. గోపి సుందర్ బీజీఎమ్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. నటీనటులు తమ పరిధిలో బాగా నటించినా లాభం లేకపోయింది.
This post was last modified on May 4, 2024 10:13 am
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…