స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం ఊహించని ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవలే మొదటిసారి ప్రసారమైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు కేవలం 6.5 టిఆర్పి రేటింగ్ రావడం అభిమానులకు షాక్ ఇవ్వగా ఇండస్ట్రీ వర్గాలు నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే ఇది చాలా తక్కువ. మిక్స్డ్ టాక్ తో ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన గుంటూరు కారం 9.2 తెచ్చుకోగా ఫ్లాప్ హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ 10కి పైగానే నమోదు చేసింది. కానీ సలార్ కు రివర్స్ జరిగింది.
దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు తెచ్చినా అది బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాగా యునానిమస్ గా ఫ్యామిలీ మొత్తం చూసే బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకోలేదు. పైగా డిసెంబర్ లో రిలీజైతే నాలుగు నెలల తర్వాత టీవీలో టెలికాస్ట్ చేయడం సహజంగానే ఆసక్తి తగ్గించేస్తుంది. నెట్ ఫ్లిక్స్, ఆన్ లైన్ లో ఎప్పుడో చూసేసిన జనాలు మళ్ళీ అదే పనిగా యాడ్స్ చూస్తూ కాలక్షేపం చేయడం కష్టం. దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కెజిఎఫ్ మొదటి భాగం 11కి పైగా చాప్టర్ టూ 9కి పైగా నమోదు చేయడం గమనించాల్సిన విషయం.
సో సలార్ బుల్లితెరపై పెద్ద ఫ్లాప్ అయ్యిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. లైవ్ మ్యాచుల కోసం పబ్లిక్ ఏ స్థాయిలో సాయంత్రాలు ఖర్చు పెడుతున్నారో జియో సినిమా యాప్ లో వ్యూస్ కౌంట్ చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సలార్ కు వచ్చిన రెస్పాన్స్ ఒకరకంగా తీవ్రంగా నిరాశకలిగించేదే. సెకండ్ టెలికాస్ట్ లో మెరుగైన నెంబర్ వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఏమో కానీ సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే దొరికేలా ఉంది.
This post was last modified on May 3, 2024 3:27 pm
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…
తమిళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును టీవీకే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ……
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన హైదరాబాద్ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…
మలయాళం బ్లాక్ బస్టర్ తుడరమ్ దర్శకుడు తరుణ్ మూర్తి ఇటీవలే చిరంజీవిని కలుసుకోవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. తుడరమ్ రీమేక్…