స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం ఊహించని ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవలే మొదటిసారి ప్రసారమైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు కేవలం 6.5 టిఆర్పి రేటింగ్ రావడం అభిమానులకు షాక్ ఇవ్వగా ఇండస్ట్రీ వర్గాలు నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే ఇది చాలా తక్కువ. మిక్స్డ్ టాక్ తో ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన గుంటూరు కారం 9.2 తెచ్చుకోగా ఫ్లాప్ హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ 10కి పైగానే నమోదు చేసింది. కానీ సలార్ కు రివర్స్ జరిగింది.
దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు తెచ్చినా అది బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాగా యునానిమస్ గా ఫ్యామిలీ మొత్తం చూసే బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకోలేదు. పైగా డిసెంబర్ లో రిలీజైతే నాలుగు నెలల తర్వాత టీవీలో టెలికాస్ట్ చేయడం సహజంగానే ఆసక్తి తగ్గించేస్తుంది. నెట్ ఫ్లిక్స్, ఆన్ లైన్ లో ఎప్పుడో చూసేసిన జనాలు మళ్ళీ అదే పనిగా యాడ్స్ చూస్తూ కాలక్షేపం చేయడం కష్టం. దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కెజిఎఫ్ మొదటి భాగం 11కి పైగా చాప్టర్ టూ 9కి పైగా నమోదు చేయడం గమనించాల్సిన విషయం.
సో సలార్ బుల్లితెరపై పెద్ద ఫ్లాప్ అయ్యిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. లైవ్ మ్యాచుల కోసం పబ్లిక్ ఏ స్థాయిలో సాయంత్రాలు ఖర్చు పెడుతున్నారో జియో సినిమా యాప్ లో వ్యూస్ కౌంట్ చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సలార్ కు వచ్చిన రెస్పాన్స్ ఒకరకంగా తీవ్రంగా నిరాశకలిగించేదే. సెకండ్ టెలికాస్ట్ లో మెరుగైన నెంబర్ వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఏమో కానీ సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే దొరికేలా ఉంది.
This post was last modified on May 3, 2024 3:27 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…