స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం ఊహించని ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవలే మొదటిసారి ప్రసారమైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు కేవలం 6.5 టిఆర్పి రేటింగ్ రావడం అభిమానులకు షాక్ ఇవ్వగా ఇండస్ట్రీ వర్గాలు నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే ఇది చాలా తక్కువ. మిక్స్డ్ టాక్ తో ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన గుంటూరు కారం 9.2 తెచ్చుకోగా ఫ్లాప్ హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ 10కి పైగానే నమోదు చేసింది. కానీ సలార్ కు రివర్స్ జరిగింది.
దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు తెచ్చినా అది బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాగా యునానిమస్ గా ఫ్యామిలీ మొత్తం చూసే బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకోలేదు. పైగా డిసెంబర్ లో రిలీజైతే నాలుగు నెలల తర్వాత టీవీలో టెలికాస్ట్ చేయడం సహజంగానే ఆసక్తి తగ్గించేస్తుంది. నెట్ ఫ్లిక్స్, ఆన్ లైన్ లో ఎప్పుడో చూసేసిన జనాలు మళ్ళీ అదే పనిగా యాడ్స్ చూస్తూ కాలక్షేపం చేయడం కష్టం. దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కెజిఎఫ్ మొదటి భాగం 11కి పైగా చాప్టర్ టూ 9కి పైగా నమోదు చేయడం గమనించాల్సిన విషయం.
సో సలార్ బుల్లితెరపై పెద్ద ఫ్లాప్ అయ్యిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. లైవ్ మ్యాచుల కోసం పబ్లిక్ ఏ స్థాయిలో సాయంత్రాలు ఖర్చు పెడుతున్నారో జియో సినిమా యాప్ లో వ్యూస్ కౌంట్ చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సలార్ కు వచ్చిన రెస్పాన్స్ ఒకరకంగా తీవ్రంగా నిరాశకలిగించేదే. సెకండ్ టెలికాస్ట్ లో మెరుగైన నెంబర్ వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఏమో కానీ సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే దొరికేలా ఉంది.
This post was last modified on May 3, 2024 3:27 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…